చేప
నీటిలో నివసించే సకశేరుక జంతువు (సాధారణంగా) మొప్పలు కలిగి ఉంటుంది / From Wikipedia, the free encyclopedia
చేపలు లేదా మత్స్యాలు మంచినీటిలో, ఉప్పునీటిలో జీవిస్తూ 25,000 జాతులు ఉన్నాయి.చేపలను వాటి శ్వాసా అవయవాల అమరికను బట్టి" 1.ఊపిరితిత్తుల చేపలు,2.మొప్పల చేపలు అని రెండు రకాలుగా విభజించ వచ్చును.చేపల ఆహారపు అలవాటును బట్టి 1.సర్వభక్షకచేపలు, 2.శాకాహారపు చేపలు, 3.మాంసాహారపు (స్వజాతి భక్షక) చేపలు అని గుర్తించ వచ్చును.అదే విధముగా అవి నివసించే అలవాటును అనుసరించి1. మంచినీటిచేపలు 2.ఉప్పునీటి చేపలు అనిచెప్పవచ్చును.చేపలు మానవఆహారముగా అత్యధిక ప్రాధాన్యతను కలిగిఉన్నాయి.అత్యధికచిన్న చేప 0.25 సెంటి.మీ.ఉంటే పెద్దచేప 2మీ.కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి.డయోడాన్ అనే చేపఅత్యంత విష పూరిత మైనది.ఇది సముద్రజలాలలోనే నివసిస్తుంది.చేపలన్నీ మానవఆహారముగా వినియోగమవుతున్నాయి.చేపలను 1.ఆనందానికి, ఆహ్లాదకరానికి గాజు తోట్టెలలో పెంచు పద్ధతిని 2.ఆహారానికై చెరువులలో పెంపకము చేయు పద్ధతిని, 3.సముద్రము, నదులు.కాలువలలో పంజారాలలో (cage culture) పెంచు పద్ధతులను శాస్త్రీయ, సాంకేతికపరిజ్ఞానముతో పెంపొందించారు. (డా.చిప్పగిరి).మానవ ఆహారముగా వినియోగించు చేపలు, రొయ్యలు, నాచులు, ముత్యాలు, ఆలిచిప్పల పెంపకమును" జలవ్యవసాయము -Aquaculture" అంటారు (Aquaculture in India-C.Gnaneswar and C.Sudhakar-1997).చేపల మాంసము తెల్లనికండరాలతో, విటమిన్-A, D, E, Kలతో, రుచికరమైన, బలవర్ధకమైన, క్రొవ్వుపదార్థములు తక్కువగా కలిగిన, సులభముగా జీర్ణ మయే మానవ ఆహారము.నదులు, సముద్రాలు, కాలువలు, సరస్సుల నుండి చేపలను పట్టి తేవటముతో పాటు వాటి పిల్లలను ఉత్పత్తి చేసి, కృత్రిమముగా, శాస్ర్తియ పద్ధతులలో పెంపకము చేస్తున్నారు (.చేపలపెంపకము-చిప్పగిరిజ్ఞానేశ్వర్) చేపలపెంపకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో దాదాపు 6లక్షల ఎకరాలలో చేపట్టారు
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/23/Georgia_Aquarium_-_Giant_Grouper_edit.jpg/640px-Georgia_Aquarium_-_Giant_Grouper_edit.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/9/97/Dead_fish.jpg/320px-Dead_fish.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Sandhuva_fish_IMG20200409144336-01-01.jpg/640px-Sandhuva_fish_IMG20200409144336-01-01.jpg)