రాజా రవివర్మ
From Wikipedia, the free encyclopedia
రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.[1]
త్వరిత వాస్తవాలు రాజా రవి వర్మ, జననం ...
రాజా రవి వర్మ | |
---|---|
జననం | 29, ఏప్రిల్ 1848 కిలమానూర్, కేరళ, ఇండియా |
మరణం | అక్టోబరు 2, 1906 కిలమానూర్, కేరళ, ఇండియా |
వృత్తి | చిత్రకారుడు |
భార్య / భర్త | రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ) |
పిల్లలు | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తండ్రి | నీలకంఠన్ భట్టాద్రిపాద్ |
తల్లి | ఉమాంబ తాంబురాట్టి |
మూసివేయి