బ్రాహ్మణగూడెం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, చాగల్లు మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
బ్రాహ్మణగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామం.. ఇది నిడదవోలు పట్టణానికి (పంగిడి వెళ్ళే మార్గంలో) 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమహేంద్రవరం పట్టణానికి ఈ గ్రామం సుమారుగా 20 కి.మీ. దూరంలో ఉంది. చాలా మంది ఈ ఊరి పేరుని చూసి ఇక్కడ అందరూ బ్రాహ్మణులే ఉంటారనుకుంటారు. కాని ఇక్కడ అలాగేమీ ఉండదు. అన్ని ఊళ్లలో ఉన్నట్లే తగు మాత్రం బ్రాహ్మణులు ఉంటారు. ఈ ఊరి మొత్తం ప్రజలలో సుమారు 90% వ్యవసాయం మీద అధారపడి జీవిస్తున్నారు. ఈ ఊరు పారిశ్రామికంగా కూడా కొంతవరకు అభివృధ్ధి చెందింది. ఈ గ్రామం చాగల్లు మండలం లోని ఒక మేజర్ పంచాయతి. ఈ ఊరి జనాభా సుమారుగా 12,000 వరకూ ఉంటుంది. ఇది మండల కేంద్రమైన చాగల్లు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 2 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1571 ఇళ్లతో, 5499 జనాభాతో 379 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2742, ఆడవారి సంఖ్య 2757. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1539 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588291[2].గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.బ్రాహ్మణగూడెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
బ్రాహ్మణగూడెం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°55′39″N 81°40′25″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | చాగల్లు |
విస్తీర్ణం | 3.79 కి.మీ2 (1.46 చ. మై) |
జనాభా (2011)[1] | 5,499 |
• జనసాంద్రత | 1,500/కి.మీ2 (3,800/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,742 |
• స్త్రీలు | 2,757 |
• లింగ నిష్పత్తి | 1,005 |
• నివాసాలు | 1,571 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్కోడ్ | 534301 |
2011 జనగణన కోడ్ | 588291 |