రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా నగరం / From Wikipedia, the free encyclopedia
రాజమహేంద్రవరం (రాజమండ్రి, రాజమహేంద్రి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం, జిల్లా కేంద్రం. ఈ నగరం తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని రాజధాని. గోదావరి నది పాపి కొండలు దాటిన తరువాత పోలవరం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశించి, విస్తరించి, ఇక్కడికి కొద్ది మైళ్ళ దిగువన ఉన్న ధవళేశ్వరం దగ్గర రెండు ప్రధాన పాయలుగా చీలి డెల్టాను ఏర్పరుస్తుంది. ఇక్కడ పన్నెండేళ్ళకొకసారి గోదావరి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.
రాజమహేంద్రవరం | |
---|---|
రాజమహేంద్రవరం | |
Nickname: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని | |
Coordinates: 16.98°N 81.78°E / 16.98; 81.78 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
Founded by | రాజరాజ నరేంద్రుడు |
Government | |
• Body | రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ (GRMC)[1] రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA)[2] |
• శాసనసభ సభ్యుడు | ఆదిరెడ్డి భవాని - పట్టణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి - గ్రామీణ |
• లోక్సభ సభ్యుడు | మార్గాని భరత్ |
విస్తీర్ణం | |
• నగరం | 44.50 కి.మీ2 (17.18 చ. మై) |
Elevation | 14 మీ (46 అ.) |
జనాభా | |
• నగరం | 3,76,333 |
• Metro | 4,76,873 |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 533 1xx |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91-883 |
వాహనాల నమోదు | AP-05 (గతం) AP-39 (2019 జనవరి 30 నుండి)[6] |
ఈ నగరం పేరు బ్రిటిష్ వారి హయాంలో రాజమండ్రిగా రూపాంతరం చెందింది. 2015 లో రాజమండ్రి పేరును రాజమహేంద్రవరంగా మార్చారు.[7] ఆదికవి నన్నయ ఇక్కడివాడే కనుక ఇది సాహిత్య పరంగా ముఖ్యమైన ఊరు. కందుకూరి వీరేశలింగం ఇక్కడి వాడే కనుక ఈ ఊరు సాంఘికంగా పెద్ద పేరు సంతరించుకొంది. ఈ విధంగా సాంఘిక, చారిత్రక, వివిధ రాజ్యాల పాలనవలన ఆర్థిక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం కావున దీనిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు.[8]