బిరాజా ఆలయం
From Wikipedia, the free encyclopedia
బిరాజా దేవాలయం, లేదా బిరిజా క్షేత్రం, భారతదేశం, ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్కు ఉత్తరంగా సుమారు 125 కి.మీ దూరంలో ఉన్న జాజ్పూర్ లోని ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. [1]ప్రస్తుతం ఉన్న ఆలయం సా.శ. 13వ శతాబ్దంలోనిర్మించబడింది. ప్రధాన విగ్రహం దుర్గా దేవి.ఆమె ఈ ఆలయంలో విరాజా (గిరిజ) గా పూజిస్తారు.ఈ ఆలయం ఉన్న కారణంగా జాజ్పూర్కు "విరజా క్షేత్రం", "బిరాజా పీఠం" అనే మారు పేర్లు వచ్చాయి. దుర్గా విగ్రహానికి రెండుచేతులు (ద్విభుజ) ఉన్నాయి. ఒక చేత్తో మహిషాసురుని ఛాతీపై ఈటెలు వేస్తూ, మరో చేత్తో అతని తోకను లాగుతుంది. ఆమె పాదాలలో ఒకటి సింహంపై, మరొకటి మహిషాసురుని ఛాతీపై ఉంటుంది. మహిషాసురుడు నీటి గేదెగా చిత్రీకరించబడ్డాడు. విగ్రహ కిరీటంలో వినాయకుడు, నెలవంక, శివలింగం ఉన్నాయి.ఈ ఆలయం పెద్ద విస్తీర్ణంలో ఉంది. శివుడు, ఇతర దేవతల అనేక మందిరాలు ఉన్నాయి.స్కంద పురాణం ప్రకారం ఇది యాత్రికుల మనస్సులకు ప్రశాంతత చేకూరుస్తుంది లేదా శుభ్రపరుస్తుంది. దీనిని విరజా లేదా బిరాజ క్షేత్రం అంటారు. జాజ్పూర్లో దాదాపు కోటిశివలింగాలు ఉన్నాయని నమ్ముతారు.[2]బిరజా ఆలయానికి దక్షిణంగా కొద్ది దూరంలో త్రిలోచనేశ్వర్ ఆలయం ఉంది.[3]
బిరాజా ఆలయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | ఒడిశా |
జిల్లా: | జాజ్పూర్ |
భౌగోళికాంశాలు: | 20°50′1.55″N 86°20′17.32″E |