బన్సీలాల్
భారత రాజయకీయనాయకుడు / From Wikipedia, the free encyclopedia
బన్సీలాల్ లెఘా (26 ఆగష్టు 1927 - 28 మార్చి 2006) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, భారత మాజీ రక్షణ మంత్రి. చాలామంది అతన్ని ఆధునిక హర్యానా వాస్తుశిల్పిగా భావిస్తారు. [1] బన్సీలాల్ తో పాటు హర్యానాలోని ప్రధాన రాజకీయ కుటుంబాలుగా ఏర్పడిన దేవీలాల్, భజన్ లాల్ లను కలిపి ఈ ముగ్గురినీ హర్యానా లాల్ త్రయం అంటారు. [2]
బన్సీలాల్ లేఘా | |||
భారత రక్షణ మంత్రి | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
---|---|---|---|
రైల్వే మంత్రి | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
3rd హర్యానా ముఖ్యమంత్రి | |||
వ్యక్తిగత వివరాలు |
బన్సీలాల్ 1967 లో తొలిసారి తోషం హర్యానా రాష్ట్ర శాసనసభకు నుంచి ఎన్నికయ్యాడు. మొత్తం ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. హర్యానా ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశాడు: 1968–75, 1986-87, 1996–99. 1975 -1977 మధ్య నున్న అత్యవసర పరిస్థితి కాలంలో బన్సీలాల్ను మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి, ఆమె కుమారుడు సంజయ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించేవారు. [3]
అతను 1975 డిసెంబరు నుండి 1977 మార్చి వరకు భారత రక్షణ మంత్రిగా పనిచేశాడు. 1975 లో కేంద్ర ప్రభుత్వంలో పోర్ట్ఫోలియో లేని మంత్రిగా కొంతకాలం పనిచేశాడు. రైల్వే, రవాణా శాఖలను కూడా కొంత కాలం పాటు నిర్వహించాడు.
1996 లో కాంగ్రెసు పార్టీ నుండి విడిపోయి హర్యానా వికాస్ పార్టీని స్థాపించాడు. 2004 లో తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరాడు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడంలో తోడ్పడ్డాడు. [4]