సుభాష్ చంద్రబోస్
భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సాయుధ పోరాట యోధుడు / From Wikipedia, the free encyclopedia
నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జనవరి 23, 1897) భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వాడు. ఇతని మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.
సుభాష్ చంద్రబోస్ | |
---|---|
జననం | (1897-01-23)1897 జనవరి 23 |
మరణం | 1945 ఆగస్టు 18 తైవాన్ (అని భావిస్తున్నారు) |
మరణ కారణం | విమాన ప్రమాదం (అని భావిస్తున్నారు) |
జాతీయత | భారతీయుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు . భారత జాతీయ సైన్యాధినేత |
బిరుదు | నేతాజీ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ ఫార్వర్డ్ బ్లాక్ (వామపక్ష పార్టీ) |
జీవిత భాగస్వామి | ఎమిలీ షెంకెల్ |
పిల్లలు | అనితా బోస్ |
తల్లిదండ్రులు | జానకీనాథ బోస్, ప్రభావతి దేవి. |
బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (ఆల్ ఇండియా యూత్ లీగ్) అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.
బోసు మరణం వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను ప్రమాదం నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు అవును ఇలాగే చాలామంది అనుకుంటున్నారు.