చుషుల్
భారతదేశం, లడఖ్ లోని గ్రామం / From Wikipedia, the free encyclopedia
చుషుల్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, లేహ్ జిల్లాలోని ఒక గ్రామం. [2] ఇది పాంగోంగ్ సరస్సుకు దక్షిణంగా, స్పంగూర్ సరస్సుకి పశ్చిమాన ఉన్న "చుషుల్ లోయ" అనే ప్రాంతంలో దుర్బుక్ తహసిల్లో ఉంది. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ చుషుల్కి తూర్పున 5 మైళ్ల దూరంలో చుషుల్ లోయ మీదుగా వెళ్తుంది. చారిత్రక యుద్ధభూమిగా ఇది ప్రసిద్ధి చెందింది.
చుషుల్ | |
---|---|
— గ్రామం — | |
దేశం | ![]() |
కేంద్ర పాలిత ప్రాంతం | లడఖ్ |
జిల్లా | Leh |
Tehsil | Durbuk[1] |
జనాభా (2011) | |
- మొత్తం | 949 |
Time zone | IST (UTC+5:30) |
Census code | 908 |
1842 ఆగష్టులో డోగ్రా-టిబెటన్ యుద్ధం ముగింపు యుద్ధం చుషుల్ వద్ద జరిగింది. ఈ యుద్ధ పర్యవసానంగా 1842 సెప్టెంబరులో సరిహద్దులలో ఆయుధాల వ్యాప్తిని నిరోధించే చుషుల్ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.[3]
1962 నవంబరు 18 న భారత చైనా యుద్ధంలో, PVC మేజర్ షైతాన్ సింగ్, 120 మందితో కూడిన తన ఐదు ప్లాటూన్లతో రెజాంగ్ లా (చుషూల్) వద్ద - చివరి వ్యక్తి, చివరి రౌండ్' వరకు పోరాడారు. అప్పుడు చైనీయులు జరిపిన మారణకాండలో కేవలం 6 గురు సైనికులు మాత్రమే బయటపడ్డారు. [4]