ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్
From Wikipedia, the free encyclopedia
ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), టెస్టు క్రికెట్ కోసం నిర్వహించే లీగ్ పోటీ. [1] [2] 2019 ఆగస్టు 1 న ప్రారంభమైన ఈ టోర్నమెంటును టెస్టు వరల్డ్ కప్ అని కూడా అంటారు. టెస్టు క్రికెట్కు ఇది ముఖ్యమైన ఛాంపియన్షిప్. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ ఒక్కో అత్యున్నత టోర్నమెంటు ఉండాలనే లక్ష్యానికి అనుగుణంగా ఐసిసి, దీన్ని రూపొందించింది. [3]
ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ | |
---|---|
దస్త్రం:ICC World Test Championship Logo.svg | |
నిర్వాహకుడు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
ఫార్మాట్ | టెస్ట్ క్రికెట్ |
తొలి టోర్నమెంటు | 2019–2021 |
చివరి టోర్నమెంటు | 2021–2023 |
టోర్నమెంటు ఫార్మాట్ | లీగ్, ఫైనల్ |
జట్ల సంఖ్య | 9 |
ప్రస్తుత ఛాంపియన్ | ఆస్ట్రేలియా (తొలి టైటిల్) |
అత్యంత విజయవంతమైన వారు | న్యూజీలాండ్ ఆస్ట్రేలియా (చెరొక టైటిల్) |
అత్యధిక పరుగులు | జో రూట్ (4050) |
అత్యధిక వికెట్లు | ఆర్ అశ్విన్ (144) |
2023–2025 |
2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ఈ పోటీని నిర్వహించాలనే తొలి ప్రణాళిక రద్దైంది. దాన్ని 2017 జూన్కి రీషెడ్యూల్ చేసారు. రెండవ టెస్టు ఛాంపియన్షిప్, 2021 ఫిబ్రవరి-మార్చిలో భారతదేశంలో జరపాలని తలపెట్టారు.[4] [5] ఐసిసి నిర్ణయించిన కటాఫ్ తేదీ 2016 డిసెంబరు 31 నాటికి మొదటి నాలుగు ర్యాంకులు పొందిన టెస్టు జట్లు, మూడు మ్యాచ్ల టెస్టు ఛాంపియన్షిప్ ఆడతాయి. రెండు సెమీ-ఫైనల్ల లోని విజేతలు ఫైనల్ ఆడతారు. [6] అయితే, 2014 జనవరిలో ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను రద్దు చేసి, 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని పునరుద్ధరించారు. [7]
2017 అక్టోబరులో ఐసిసి, టెస్టు లీగ్కు సభ్యుల అంగీకారం పొందిందని ప్రకటించింది. ఇందులో రెండు సంవత్సరాల పాటు సిరీస్లు ఆడే టాప్ 9 జట్ల లోంచి మొదటి రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఈ ఫైనల్ను ఐసిసి టోర్నమెంటుగా పరిగణిస్తారు.[8] WTC లోని లీగ్ గేమ్లను ఐసిసి ఈవెంట్గా పరిగణించరు. వాటి ప్రసార హక్కులు ఆతిథ్య దేశపు క్రికెట్ బోర్డుకే ఉంటాయి, ఐసిసికి కాదు. కానీ లీగ్ దశ మ్యాచ్ల మాదిరిగా కాకుండా, WTC ఫైనల్స్ మాత్రం ఐసిసి ఈవెంట్గా పరిగణించారు. మొదటి ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2019 యాషెస్ సిరీస్తో ప్రారంభమైంది. 2021 జూన్లో జరిగిన ఫైనల్లో భారత్ను ఓడించి న్యూజిలాండ్ ట్రోఫీని అందుకోవడంతో అది ముగిసింది. రెండవ ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2021 ఆగస్టు 4న పటౌడీ ట్రోఫీ సిరీస్తో ప్రారంభమైంది.[9] 2023 జూన్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ను ఓడించి ట్రోఫీని అందుకుంది.