![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/56/PM_Modi_in_Atal_Tunnel_2020.jpg/640px-PM_Modi_in_Atal_Tunnel_2020.jpg&w=640&q=50)
అటల్ సొరంగ మార్గం
హిమాచల్ ప్రదేశ్లో రోహ్తాంగ్ కనుమ కింద నిర్మించిన రహదారి సొరంగం / From Wikipedia, the free encyclopedia
అటల్ సొరంగ మార్గం, మనాలి - లేహ్ రోడ్డు మార్గంలో, పీర్ పంజాల్ శ్రేణిలో, రోహ్తాంగ్ కనుమ కింద 9.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సొరంగ రహదారి. ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పదేళ్లు పట్టింది.[1] లేహ్ నుంచి మనాలి 475 కిలోమీటర్లు ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల ఈ దూరం 46 కి.మీ. మేర తగ్గింది. దీనిని గతంలో రోహతాంగ్ టన్నెల్ గా పిలిచేవారు. తరువాత భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి పేరు పెట్టారు. ఈ సొరంగం సముద్ర మట్టానికి 3,100 మీటర్ల (10,171 ft) ఎత్తులో ఉండగా, రోహతాణ్గ్ కనుమ 3,978 మీటర్ల (13,051 అడుగులు) ఎత్తులో ఉంది.ఇది 10,000 అడుగుల ఎత్తులో వున్న రహదారి సొరంగాలలో ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం ఇది. లాహువల్ స్పితి ప్రజలను ఏడాది పొడవునా భారత దేశంతో అనుసంధానం చేయడంతో పాటు, భద్రతా దళాలకు ప్రధాన వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందించే ఫార్వర్డ్ కనెక్టివిటీగా ఈ సొరంగం సహాయపడుతుంది.[2]
![]() | |
అవలోకనం | |
---|---|
ప్రదేశం | రోహ్తాంగ్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం ![]() |
అక్షాంశ,రేఖాంశాలు | 32.401270°N 77.148335°E / 32.401270; 77.148335 |
స్థితి | క్రియాశీలమైనది |
మార్గము | లెహ్-మనాలీ హైవే |
నిర్వహణ వివరాలు | |
ప్రారంభ తేదీ | 28 జజూన్ 2010 |
ప్రారంభం | 3 అక్టోబరు 2020 |
నిర్వాహకుడు | బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ |
ట్రాఫిక్ | మోటారు వాహనాలు |
సాంకేతిక వివరాలు | |
పొడవు | 9.02 కిలోమీటర్లు (5.60 మై.) |
సందుల సం. | రెండు(ఒక్కక్కటి రెండు దిశలలో) |
కార్యాచరణ వేగం | 40–60 km/h (25–37 mph) |
వెడల్పు | 10 మీటర్లు (33 అ.) |
లఢక్ కు వెళ్లే రెండు మార్గాల్లో ఒకటైన లెహ్-మనాలి హైవే, రోహతాంగ్ కనుమ శీతాకాలంలో భారీ హిమపాతం మంచుతుఫానులను గురవుతుంది ఇది సంవత్సరంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే రోడ్డు ట్రాఫిక్ కొరకు తెరవబడుతుంది. ఈ సొరంగం నిర్మాణం వలన శీతాకాలంలో రహదారిని తెరిచి ఉండటానికి అవకాశం వున్నది . లేహ్ కు వెళ్ళే మరో మార్గం శ్రీనగర్-ద్రాస్-కార్గిల్-లేహ్ రహదారిలో జోజి లా కనుమ ద్వారా ఉంటుంది , ఇది కూడా సంవత్సరంలో దాదాపు నాలుగు నెలల పాటు మంచు తో మూసుకుపోతుంది . జోజి లా పాస్ కింద 14 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ రెండు మార్గాలు అక్సాయి చిన్ సియాచెన్ గ్లేసియర్ వైపు పశ్చిమాన సైనిక ఉప-సెక్టార్ లోకి సైనిక సరఫరాలను సమకూర్చడానికి కీలకమైనవి.అటల్ టన్నెల్ సరిగ్గా రోహతాంగ్ పాస్ కింద లేదు; పాస్ కు కాస్త పడమరగా ఉంటుంది. దక్షిణ ద్వారం, ధుండికి ఉత్తరంగా ఉంది, దీనికి అవతలి వైపు బియాస్ నది ఉంది. ఈ సొరంగం ఉత్తర చివర, ప్రస్తుతం ఉన్న రహదారిలో రోహ్తంగ్ పాస్ తరువాత మొదటి గ్రామం గా ఉన్న గ్రామఫూకు పశ్చిమంగా టెలింగ్ గ్రామం సమీపంలో ఉన్న లేహ్-మనాలి హైవేను కలుస్తుంది.బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO), భారతదేశపు వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా నిర్మించబడ్డ, ఈ సొరంగం దౌఘ్ పోర్టల్ కు యాక్సెస్ రోడ్డు కు 2002 మే 26న శంకుస్థాపన జరిగింది. అటల్ బిహారీ వాజపేయి భారత ప్రధానిగా ఉన్న సమయంలో 2000 జూన్ 3న ప్రతిష్టాత్మక సొరంగ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు[3].సొరంగం వెడెల్పు 10.5 మీటర్లు ఉండగా ఈ తొమ్మిది కి.మీ. మార్గంలో ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరాను బిగించారు. వీటితో పాటు ప్రతి 500 మీటర్లకు ఒకచోట అత్యవసర ద్వారం. అగ్నిప్రమాదాలను నివారించడానికి సొరంగ మార్గమంతటా అగ్నిమాపక వ్యవస్థను, రహదారికి ఇరువైపులా మీటరు పుట్పాత్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం టన్నెల్ కేవలం సంవత్సరంలో ఐదు నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని అటల్ టన్నెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా తెలిపారు[4]