సిద్దిపేట

తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని పట్టణం From Wikipedia, the free encyclopedia

సిద్దిపేటmap

సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణం. సిద్దిపేట జిల్లా పరిపాలన, రెవెన్యూ డివిజన్ కేంద్రం. ఈ పట్టణానికి పూర్వం సిద్దిక్ పేట అని పేరు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2021 అవార్డుకు జాతీయస్థాయిలో సిద్ధిపేట ప‌ట్ట‌ణం ఎంపికైంది. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ‌, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్య‌క్ర‌మాల‌ను సంపూర్ణంగా అమ‌లు చేయ‌డంతో సిద్ధిపేటకు ఈ అవార్డు వచ్చింది. 2021 నవంబరు 20న ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ మంజుల రాజనర్సు, క‌మిష‌న‌ర్ ర‌మ‌ణాచారి ఈ అవార్డును అందుకున్నారు.[3]

  ?సిద్ధిపేట
తెలంగాణ  భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) సిద్దిపేట జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[1][2] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలకసంఘం

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట పట్టణ మండలంలోకి చేర్చారు.[4]

గణాంక వివరాలు

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

రాజకీయాలు

పార్లమెంట్ సభ్యులు

  • 1952–1966: నియోజకవర్గం ఉనికిలో లేదు
మరింత సమాచారం లోక్ సభ, వ్యవధి ...
లోక్ సభవ్యవధిM.P. పేరుపార్టీ అనుబంధం
నాల్గవ1967–71జి. వెంకటస్వామిఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఐదవ1971–77జి. వెంకటస్వామితెలంగాణ ప్రజా సమితి
ఆరవ1977–80నంది యెల్లయ్యఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఏడవ1980–84నంది యెల్లయ్యఇండియన్ నేషనల్ కాంగ్రెస్
ఎనిమిదవ1984–89జి. విజయ రామారావుతెలుగు దేశం పార్టీ
తొమ్మిదవ1989–91నంది యెల్లయ్యఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పదో1991–96నంది యెల్లయ్యఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పదకొండవ1996–98నంది యెల్లయ్యఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పన్నెండవ1998–99మల్యాల రాజయ్యతెలుగు దేశం పార్టీ
పదమూడవ1999-04మల్యాల రాజయ్యతెలుగు దేశం పార్టీ
పద్నాల్గవ2004-09సర్వే సత్యనారాయణఇండియన్ నేషనల్ కాంగ్రెస్
మూసివేయి
  • 2008 నుండి: నియోజకవర్గం ఉనికిలో లేదు

2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు[5]

మరింత సమాచారం పార్టీ, అభ్యర్థి ...
2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
BRS తన్నీరు హరీశ్ రావు 1,05,514 58.17
INC పూజల హరి కృష్ణ 23,206 12.79
BJP దూది శ్రీకాంత్ రెడ్డి 23,201 12.79
BSP గాధగోని చక్రధర్ గౌడ్ 16,610 9.16
స్వతంత్ర పిల్లి సాయి కుమార్ 4,970 2.74
స్వతంత్ర ఇతరులు 6,602 3.64
నోటా పై వ్యక్తులలో ఎవరూ కారు 1,300 0.72
మెజారిటీ 82,308 100.00
మొత్తం పోలైన ఓట్లు 1,81,403
BRS hold Swing
మూసివేయి

ఫలితాలు వివరముగా

మరింత సమాచారం క్ర.సంఖ్య, అభ్యర్థి ...
క్ర.సంఖ్యఅభ్యర్థిపార్టీమొత్తం ఓట్లు % ఓట్లు
1గాథగోని చక్రధర్ గౌడ్బహుజన్ సమాజ్ పార్టీ16,6109.16
2తన్నీరు హరీశ్ రావుభారత రాష్ట్ర సమితి1,05,51458.17
3దూది శ్రీకాంత్ రెడ్డిభారతీయ జనతా పార్టీ23,20112.79
4పూజల హరి కృష్ణభారత జాతీయ కాంగ్రెస్23,20612.79
5నర్సింహారెడ్డి అదుల్లాభరత చైతన్య యువజన పార్టీ2060.11
6బాబు కర్రోల్లధర్మ సమాజ్ పార్టీ2180.12
7రొమాలా బాబు దుర్గయ్యభారత ప్రజా బంధు పార్టీ1640.09
8వతరికరి నగరానిఆబాద్ పార్టీ4780.26
9ఎక్కల్దేవి లింగంస్వతంత్ర3580.2
10ఏటీ ఆంజనేయులుస్వతంత్ర6750.37
11గుమ్మడి శ్రీశైలంస్వతంత్ర4430.24
12గువ్వల సంతోష్ కుమార్స్వతంత్ర2910.16
13ధర్మాజీపేట ప్రతాప్ రెడ్డిస్వతంత్ర2270.13
14పశికాంతి శంకర్స్వతంత్ర5430.3
15పిల్లి సాయి కుమార్స్వతంత్ర4,9702.74
16పైసా రామకృష్ణస్వతంత్ర8810.49
17పోతుగంటి నర్సింహారెడ్డిస్వతంత్ర5040.28
18బర్రె మల్లయ్యస్వతంత్ర9280.51
19రజినీకర్ చడాస్వతంత్ర1520.08
20వరికోలు శ్రీనివాస్స్వతంత్ర3380.19
21శ్రీకాంత్ పెద్దసాయిగారిస్వతంత్ర1960.11
22నోటాపైవేవీ లేవు1,3000.72
మొత్తం1,81,403
మూసివేయి

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని దుద్దాడలోని 50 ఎకరాలలో 63.6 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2021, జూన్ 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.[6] కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ లతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[7]

Thumb
1972 జూన్ 3న సిద్దిపేటలో జన్మించిన తన్నీరు హరీశ్ రావు చిత్రం. (తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు)

చెరువులు

సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు. దీనినే మిని టాంక్ బండ్ అందరు సిద్ధిపేటలో మరిన్ని చెరువు కలవు వాటిలో ఎర్ర చెరువు నర్సాపూర్ చెరువు చింతల్ చెరువు కలవు

ఆరోగ్యం

2018లో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయింది.[8]

భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌లు

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్‌లో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్‌కు చెందిన గౌరా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9]

భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రం

భారతదేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని 2022 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 300కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తారు.[10][11]

బస్తీ దవాఖాన

డబుల్ బెడ్‌రూం కేసీఆర్‌ నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన నూతన భవనాన్ని 2022 జూన్ 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందిస్తుండగా, 18 లక్షల రూపాయలతో పక్కా భవనం నిర్మించారు. ఈ దవాఖానాలో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడంపాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు.[12]

ఐటీ టవర్

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో సిద్దిపేట పట్టణంలో 1,72,645 చదరపు అడుగుల విస్తీర్ణంలో 63 కోట్ల వ్యయంతో 718 సీటింగ్‌ కెపాసిటీతో జీప్లస్‌ 4 అంతస్తులతో తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట ఐటీ టవర్‌ను నిర్మించింది. ఈ ఐటీ టవర్‌ను 2023, జూన్ 15న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కలిసి ప్రారంభించి, అందులోని వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశారు.[13][14] 2020, డిసెంబరు 10న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఐటీ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాడు.[15]

పోలీస్ కమిషనరేట్

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అనేది సిద్దిపేట పట్టణంలో చట్టాన్ని అమలుచేయడానికి, నేర దర్యాప్తులో ప్రాథమిక బాధ్యతలను కలిగి ఉన్న నగర పోలీసు విభాగం. దసరా పండుగ సందర్భంగా 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించబడిన 21 జిల్లాలు, 4 కొత్త కమిషనరేట్‌లతోపాటు సిద్దిపేట కమిషనరేట్ కూడా అధికారికంగా ఏర్పాటుచేయబడింది.

అవార్డులు

సిద్ధిపేట పట్టణానికి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.[3]

  1. 2012: రాష్ట్ర స్థాయిలో క్లీన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు
  2. 2015: జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ అవార్డు (సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్)
  3. 2016: జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ
  4. 2016: రాష్ట్ర స్థాయిలో హరిత మిత్ర అవార్డు
  5. 2016: చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణంలో జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు
  6. 2016: జాతీయ స్థాయిలో ఓడీఎఫ్ సర్టిఫికెట్
  7. 2016: రాష్ట్ర స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు
  8. 2017: జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కారం
  9. 2017: సీఎం చే రాష్ట్ర స్థాయి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు
  10. 2017: జాతీయ స్థాయిలో ఐఎస్వో అవార్డు
  11. 2018: జాతీయ స్థాయిలో సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డు
  12. 2018: జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు
  13. 2018: 6 పద్ధతులు అమలులో ఉన్నందున జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు
  14. 2018: స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం
  15. 2019: జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు
  16. 2019: జాతీయ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు (దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో)
  17. 2021: సిద్ధిపేట పట్టణంలో 100% ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా నిర్వహణకు రెండు స్కాచ్ అవార్డులు
  18. 2021: దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డుకు ఎంపిక

రవాణా సౌకర్యం

ఇది కరీంనగర్, హైదరాబాదు ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

ప్రముఖులు

శిల్పారామం

పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతం బైపాస్ రోడ్డులో 25 కోట్ల రూపాయలతో సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా సిద్దిపేట శిల్పారామం పేరిట పర్యాటక కేంద్రం నిర్మించబడుతోంది.

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.