From Wikipedia, the free encyclopedia
ఇదే పేరుతో విడుదలైన దేవాలయం సినిమా గురించి చూడండి.
దేవళం లేదా దేవాలయం, మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాలలో ఆవాహన చేయబడిఉంటారు. చారిత్రికంగా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. సా.శ. 1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి.[1]
దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.
ఆగమ శాస్త్రములో దేవాలయాలలో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.
క్రైస్తవులు దేవుడైన యెహోవాను ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించే మందిరాన్ని చర్చి అంటారు.
ముస్లింలు ప్రవక్త మహమ్మద్ చెప్పినపద్ధతిలో దేవుడైన అల్లాహ్ను ప్రార్థించే స్థలాలను మసీదులు అంటారు.
సిక్కు మతస్థులు ప్రార్థించే ప్రదేశాలను గురుద్వారాలు అంటారు.
రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్ (58,253), గుజరాత్ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.
Seamless Wikipedia browsing. On steroids.