2019 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో 17 వ లోక్సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
543[వివరం 1] (545) లోక్సభ స్థానాలు మెజారిటీ కోసం 272 అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 67.11% (0.7%) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స్థానం ప్రకారం ఫలితాలు. | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
90 కోట్ల ప్రజలు ఓటుహక్కుగలవారు కాగా రికార్జుస్థాయిలో 67 శాతం మందివోటు వేశారు. మహిళల వోటువేయటం కూడా అత్యధిక స్థాయిలో జరిగింది.[1][2][వివరం 2]
భారతీయ జనతా పార్టీ ముందు కంటె ఎక్కువగా మొత్తం 303 స్థానాలు గెలిచింది[4] బిజెపి నాయకత్వంలోని ఎన్డిఎ 353 స్థానాలు గెలిచిది.[5] భారత జాతీయ కాంగ్రెస్ 52 స్థానాలు, కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ మొత్తం 91 స్థానాలు గెలిచింది. ఇతర పార్టీలు , వాటి కూటములు స్థానాలు గెలిచాయి.[6] భారత జాతీయ కాంగ్రెస్ 10% స్థానాలు అనగా 55 స్థానాల కంటె తక్కువ సాధించడంతో అధికార ప్రతిపక్ష పార్టీ స్థాయి కాలేకపోయింది.[7][8]