జనవరి 1: బ్రిటిష్ సింహాసనానికి వారసుణ్ణని చెప్పుకుంటున్న జేమ్స్ ఫ్రాన్సిస్ ఎడ్వర్డ్ స్టువర్ట్కు సహాయం చేయడానికి కుట్ర పన్నినందుకు గ్రేట్ బ్రిటన్ రాజ్యానికి స్వీడన్ రాయబారి కౌంట్ కార్ల్ గిల్లెన్బోర్గ్ను లండన్లో అరెస్టు చేశారు.[1]
జనవరి 4: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, డచ్ రిపబ్లిక్ లు ట్రిపుల్ అలయన్స్పై సంతకం చేశాయి [1]
ఫిబ్రవరి: ఫ్రాన్స్, బ్రిటన్ మధ్య జరిగిన ఒప్పందం తరువాత, జేమ్స్ స్టువర్ట్ ఫ్రాన్స్ను విడిచిపెట్టి, పోప్ క్లెమెంట్ XI వద్ద ఆశ్రయం పొందాడు.[1]
ఫిబ్రవరి 26–మార్చి 6: ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ వరసబెట్టి వచ్చిన మంచు తుఫానులలో కూరుకుపోయి, స్తంభించిపోయింది
సెప్టెంబర్ 29: గ్వాటెమాలా భూకంపం: 7.4 తీవ్రతతో భూకంపం ఆంటిగ్వా గ్వాటెమాలాను తాకి, నగరాన్ని చాలావరకు నాశనం చేసింది. గ్వాటెమాలా రాజధానిని వేరే ప్రదేశానికి తరలించాలని అధికారులు ఆలోచించారు.
తేదీ తెలియదు: ఫర్రుక్సియార్ పాలనా కాలంలో బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్ పన్ను రహిత వాణిజ్య హక్కులను 3,000 రూపాయల వార్షిక చెల్లింపుతో కొనుగోలు చేసింది.
తేదీ తెలియదు: సర్ ఐజాక్ న్యూటన్ వెండి, బంగారం మధ్య ఒక కొత్త నాణెం నిష్పత్తిని ఆవిష్కరించాడు.
తేదీ తెలియదు: 1717 బహ్రెయిన్పై ఒమనీ దాడి
తేదీ తెలియదు: మణిపూర్ మహారాజా పంహీబాను శాంతిదాస్ గోస్వామి హిందూ మతంలోకి మార్చాడి. దానిని తన రాజ్యంలో అధికారిక మతంగా ప్రకటించారు.
తేదీ తెలియదు: ముర్షిద్ కులీ ఖాన్ తనను తాను బెంగాల్ సుబాకు మొదటి నవాబుగా ప్రకటించుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రంగా విధేయత చూపిస్తూ ఈ నవాబులు బెంగాల్కు సార్వభౌమ పాలకులుగా పాలించారు.[2]