పంజాబ్ ప్రాంతం
ప్రస్తుత పాకిస్తాన్, భారతదేశాలలో ఉన్న భౌగోళిక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
పంజాబ్ (/pʌndʒˈɑːb/ ( listen), /ˈpʌndʒɑːb/, /pʌndʒˈæb/, /ˈpʌndʒæb/) (ఐదు నదుల ప్రాంతంగా సుప్రసిద్ధం) [1] (పంజాబీ: پنجاب, ਪੰਜਾਬ; హిందీ: पंजाब), అన్నది భారత ఉపఖండం లేదా దక్షిణాసియాలోని వాయువ్యపు చివరి ప్రదేశాలు కల ప్రాంతం. ఉత్తర భారతదేశంలో, తూర్పు పాకిస్తాన్ లోని భూభాగాల్లో ఇది విస్తరించింది.
పంజాబ్ پنجاب ਪੰਜਾਬ पंजाब | |
అతిపెద్ద నగరాలు | ఢిల్లీ లాహోర్ ఫైసలాబాద్ |
దేశాలు |
|
Official languages | |
Area | 445,007 km2 (171,818 sq mi) |
జనాభా (2011) | ~200 కోట్లు |
జన సాంద్రత | 449/km2 |
మతాలు | |
Demonym | పంజాబీ |
ఈ ప్రాంతంలో సింధు లోయ నాగరికత, వేద సంస్కృతి విలసిల్లాయి, అచేమెనిద్ సామ్రాజ్యం, గ్రీకులు, కుషాణులు, గజ్నవీదులు, తైమూరులు, మొగలులు, ఆఫ్ఘాన్లు, బ్రిటీష్ వారు మొదలైన విదేశీయులెందరో సాగించిన అసంఖ్యాకమైన, మేరలేని దండయాత్రలను చారిత్రికంగా చూస్తూనేవుంది. పంజాబ్కు చెందిన ప్రజల్ని పంజాబీలు అని, వారి భాషను పంజాబీ భాష అని పిలుస్తున్నారు. పంజాబ్ ప్రాంతంలోని ప్రధానమైన మతాలు ఇస్లాం, హిందూ మతం, సిక్ఖు మతాలు. ఇతర మత సమూహాల్లో క్రైస్తవం, జైన మతం, బౌద్ధం కూడా ఉన్నాయి.
1947లో బ్రిటీష్ ఇండియా పరిపాలన నుంచి భారత ఉపఖండం స్వతంత్రం కావడంతోటే ఈ ప్రాంతం భారత, పాకిస్తాన్ దేశాల మధ్య విభజితమైంది.
పాకిస్తాన్ లో పంజాబ్ ప్రాంతంలో పాకిస్తానీ పంజాబ్, ఇస్లామాబాద్ రాజధాని ప్రాంతం, భీంబెర్, మీర్ పూర్ వంటి ప్రాంతాల చుట్టూ ఉన్న ఆజాద్ కాశ్మీర్ లోని దక్షిణ ప్రాంతాలు,[2] ఖైబర్ పఖ్తూన్ఖ్వా లోని కొన్ని ప్రాంతాలు (పెషావర్ వంటివి[3][4] పంజాబ్ ప్రాంతాలుగా అక్కడ పిషోర్ గా పేరొందాయి).[5]
భారతదేశంలో ఈ ప్రాంతంలో పంజాబ్ రాష్ట్రం, చండీగఢ్, జమ్ము డివిజన్,[6][7] హర్యానా,[8] హిమాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, ఢిల్లీలోని కొన్ని భాగాలు, రాజస్థాన్ లోని కొంత భాగం,[9][10][11][12] ప్రధానంగా గంగానగర్ జిల్లా, హనుమాన్గర్ జిల్లా వంటివి ఉన్నాయి.[13]