కేరళలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
2019 లో కేరళలో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
17వ లోక్సభను ఏర్పాటు చేయడానికి 2019 భారత సార్వత్రిక ఎన్నికలు, కేరళ లోని 20 నియోజకవర్గాలకు 2019 ఏప్రిల్ 23 న జరిగాయి. [3]
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
20 స్థానాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 77.84% (3.95%) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాష్ట్రం లోని మొత్తం 20 స్థానాలకు గాను భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 19 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. అయితే దాదాపు 15% ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒక్క సీటుతో పరాజయం పాలైంది.
శబరిమల నిరసనలు, యూపీఏ ప్రధాని అభ్యర్థి రాష్ట్రం నుంచి పోటీ చేయడం, నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను అమలు, ఎస్ఎన్డీపీ యోగం, భారత్ ధర్మ జన సేనతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. [4]
రాష్ట్రం నుండి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థులు ఎవరూ గెలవనప్పటికీ, కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్, రెండవ మోడీ మంత్రివర్గంలో ఒక మంత్రి పదవిని పొందాడు.