![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b8/New_Delhi_government_block_03-2016_img3.jpg/640px-New_Delhi_government_block_03-2016_img3.jpg&w=640&q=50)
17వ లోక్సభ
భారత సార్వత్రిక ఎన్నికలలో ఏర్పడిన 17వ లోక్సభ / From Wikipedia, the free encyclopedia
2019 భారత సార్వత్రిక ఎన్నికలలోఎన్నికైన సభ్యులచే 17వ లోక్సభ ఏర్పడింది.[1] భారతదేశం అంతటా ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 2019 ఏప్రిల్ 11 నుండి 2019 మే 19 వరకు ఏడుదశల్లో నిర్వహించింది. 2019 మే 23 ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అదే రోజు ఫలితాలు ప్రకటించారు. 17 వ సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యాడు. ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని దక్కించుకోవడానికి ఏ పార్టీకి కనీసం 10% స్థానాలు పొందలేదు. అందువలన 17వ లోక్సభకు ప్రతిపక్ష నాయకుడును ఎన్నుకోబడలేదు.అయితే లోక్సభలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్కు అధిర్ రంజన్ చౌదరి నేతగా ఉన్నాడు.[2][3] 17వ లోక్సభలో మహిళా ప్రతినిధులు అత్యధికంగా 14 శాతం మంది ఉన్నారు. మొత్తం 545 మంది లోక్సభ సభ్యులలో, తొలిసారి ఎంపీలుగా 267 మంది సభ్యులు గెలుపొందారు. గెలుపొందిన మొత్తం సభ్యులలో 233 మంది సభ్యులపై (43 శాతం) నేరారోపణలు ఉన్నాయి.
17వ లోక్సభ | |||||
---|---|---|---|---|---|
| |||||
![]() పార్లమెంట్ హౌస్ (ఇండియా), సంసద్ భవన్, న్యూ ఢిల్లీ, భారతదేశం | |||||
అవలోకనం | |||||
శాసనసభ | భారత పార్లమెంట్ | ||||
కాలం | 2019 మే 24 – | ||||
ఎన్నిక | 2019 భారత సార్వత్రిక ఎన్నికలు | ||||
ప్రభుత్వం | మూడవ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం | ||||
సార్వభౌమ | |||||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||||
ఉపరాష్ట్రపతి | జగదీప్ ధన్కర్ | ||||
హౌస్ ఆఫ్ ది పీపుల్ | |||||
![]() | |||||
సభ్యులు | 543 | ||||
సభ స్పీకర్ | ఓం బిర్లా | ||||
సభ నాయకుడు | నరేంద్ర మోదీ | ||||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||||
ప్రతిపక్ష నాయకుడు | ఖాళీ 2014 మే 26 నుండి | ||||
పార్టీ నియంత్రణ | జాతీయ ప్రజాస్వామ్య కూటమి |