హైదరాబాదు నగరంలోని మెట్రో రైలు ప్రాజెక్టు From Wikipedia, the free encyclopedia
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు నగరంలో ప్రయాణం వేగవంతం, సౌకర్యవంతం చేసే రైలు సేవలనందిస్తోంది. మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత, ఎల్ బి నగర్ - అమీర్ పేట మార్గాన్ని అక్టోబర్ 2018 లో ప్రారంభించారు. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గాన్ని మార్చి 2019 న ప్రారంభించారు. [3]
హైదరాబాదు మెట్రో రైలు | |||
---|---|---|---|
ముఖ్య వివరాలు | |||
స్థానిక ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | ||
ట్రాన్సిట్ రకం | మెట్రోరైలు | ||
లైన్ల సంఖ్య | 3 (Phase I) | ||
స్టేషన్ల సంఖ్య | 66 (Phase I) | ||
ముఖ్య కార్యనిర్వహణాధికారి | నల్లమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి, MD[1] | ||
ప్రధానకార్యాలయం | మెట్రో భవన్, సైఫాబాద్, హైదరాబాదు | ||
వెబ్ సైటు | |||
నిర్వహణ | |||
ప్రారంభమైన కార్యాచరణ | 2017 నవంబరు 29 | ||
నిర్వహించేవారు | హైదరాబాద్ మెట్రో రైల్ లి. (HMRL) | ||
సాంకేతిక అంశాలు | |||
వ్యవస్థ పొడవు | 72.16 కి.మీ. (44.84 మై.) (Phase I)[2] 97 కి.మీ. (60 మై.) (Phase II) | ||
ట్రాక్ గేజ్ | 1,435 mm (4 ft 8+1⁄2 in) standard gauge | ||
విద్యుదీకరణ | 25kV, 50Hz AC ఓవర్హెడ్ లైను | ||
సరాసరి వడి | 34 km/h (21 mph) | ||
అత్యధిక వడి | 80 km/h (50 mph) | ||
|
హైదరాబాదు మెట్రో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
తొలి దశ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం ఫిబ్రవరి 7 2020 నుండి అందుబటులోకి వచ్చినది . ఈ మార్గం ప్రారంభంతో మెట్రో మొదటి దశలో 72 కి.మీ.లకు గాను 69 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చినట్లయింది. హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గా గుర్తింపుపొందింది.[4]
మెట్రో రైలు ప్రారంభించిన తొలిరోజే 2 లక్షల మంది ప్రయాణించారరు. 2022 నవంబరు 29 నాటికి ఐదేండ్ల కాలంలో మెట్రోలో 31 కోట్ల మంది ప్రయాణించగా, మెట్రోలో ప్రతి రోజు 4.40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు.[5]
హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు మియాపూర్ నుంచి LB నగర్ మీదుగా అమీర్ పేట, ఎంజీబీఎస్ మీదుగా రెడ్ లైన్ తన సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే నాకోల్ నుంచి రాయదుర్గ్ మీదుగా సికింద్రాబాద్, అమీర్ పేట్ మీదుగా బ్లూ లైన్ అమీర్ పేట రెడ్ లైన్, బ్లూ లైన్ కు ఇంటర్ చేంజ్ స్టేషన్, జేబీఎస్ఎం నుండి జీబీఎస్ మార్గం గ్రీన్ లైన్ కు తన సర్వీసులను నిర్వహిస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి వారపు రోజులు , వారాంతాల్లో 06:30 గంటల నుండి 22:00 గంటల వరకు నడుస్తుంది. ఇవి తాత్కాలిక సమయాలు కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా మార్చబడతాయి. చివరి రైలుకు 5 నిమిషాల ముందు ఆ స్టేషన్ టికెట్ కౌంటర్లు మూసివేస్తారు[6].
చాలా ట్రాఫిక్, రవాణా అధ్యయనాల ఆధారంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి దశలో మూడు కారిడార్లను ఆమోదించింది. ఢిల్లీ మెట్రో రైలు కార్పరేషన్ వారు ఈ అధ్యయన పత్రాలు తయారుచేసారు.[4]
కారిడార్ | దూరం | స్టేషన్లు | ప్రయాణ సమయం | ప్రస్థుత స్థితి |
---|---|---|---|---|
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు | 29 కి.మీ. | 27 | 45 ని. | పూర్తి |
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా | 15 కి.మీ. | 16 | 22 ని. | పాక్షికం |
నాగోలు నుండి రాయదుర్గ్ | 28 కి.మీ. | 23 | 45 ని. | పూర్తి |
రాయదుర్గం నుండి ఎయిర్పోర్టు | 31 కి.మీ. | 7 | 30 ని. | ప్రతిపాదన |
మెట్రో రైలు మొదటి దశ నాగోలు- మియాపూర్ మధ్య 27.6 కి.మీ. మెట్రో రైలు మార్గంలో 24 స్టేషన్లు ఉన్నాయి ఈ మొదటి దశ 27.6 కిలోమీటర్ల లైనులో 18 రైళ్లను నడపాలని నిర్ణయించారు ఒక్కో రైలులో మూడు కోచ్లుంటాయి . ప్రతి పది నిముషాలకు ఒక రైలు నడపాలన్నది యోచన. మెట్రో రైళ్ల వ్యవస్థను పర్యవేక్షించే అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేశారు.[3] మొత్తం 72 కిలోమీటర్ల పొడవున నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నియంత్రిస్తారు. ఈ సెంటర్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంప్యూటర్ వ్యవస్థ ఉంది.
హైదరాబాదు మెట్రో ప్రారంభమై 5 ఏళ్ళు గడిచిన సందర్భంగా మెట్రో ప్రాజెక్టు కారిడార్-4లో భాగంగా రాయదుర్గం నుండి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ సమీపంలోని ఎయిర్పోర్టు వరకు గల 31 కి.మీ.ల దూరం 6,250 కోట్ల రూపాయలతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కార్యరూపం ఇచ్చింది. విమానాశ్రయంతో మెట్రో రైలు మార్గం అనుసంధానమైతే కేవలం 25-30 నిమిషాల్లో అక్కడి నుంచి ఐటీ కారిడార్లోని రాయదుర్గం, మైండ్ స్పేస్, హైటెక్ సిటీ సైబర్ టవర్స్కు చేరుకోవచ్చు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ (31 కిలోమీటర్లు) మార్గంలో ప్రతి 5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున బయో డైవర్సిటీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, టీఎస్ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్ టౌన్, ఎయిర్పోర్టు కార్గో స్టేషన్, టర్మినల్ ప్రాంతాలలో 7-8 మెట్రో స్టేషన్లు నిర్మించేలా డీపీఆర్ను సిద్ధం చేశారు. ఈ కారిడార్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్తోపాటు హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ), తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ), జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్టు లిమిటెడ్లను భాగస్వాములుగా ఉంటాయి.[7][8] హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే ప్రాజెక్టు. 2025 చివరి నాటికి దీన్ని పూర్తి చెయ్యాలని తలపెట్టారు.
ఈ ప్రాజెక్టుకు 2022 డిసెంబరు 9న గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్స్పేస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పునాదిరాయి వేసి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, ఎంపీలు కె. కేశవరావు, జి. రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.[9]
లైను | మొదలైనది | స్టేషన్లు | పొడవు | టర్మినళ్ళు | సగటు తరచుదనం (నిమిషాల్లో) | |
---|---|---|---|---|---|---|
రెడ్ | 2017 నవంబరు 29 | 27 | 29 కి.మీ. (18 మై.) | మియాపూర్ | ఎల్.బి నగర్ | 4 1/2 నిమిషాలు (ఒత్తిడి వేళల్లో)
7 నిమిషాలు (ఇతర వేళల్లో ) |
బ్లూ | 23 | 27 కి.మీ. (17 మై.) | రాయదుర్గం | నాగోలు | ||
గ్రీన్ | 2020 ఫిబ్రవరి 7 | 9 | 10.5 కి.మీ. (6.5 మై.) | JBS PG | ఎం.జి.బి.ఎస్ | |
మొత్తం | 59 | 66.5 కి.మీ. (41.3 మై.) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.