సైప్రస్
From Wikipedia, the free encyclopedia
Karoulla-Vrikki D (2009). "Greek in Cyprus: Identity Oscillations and Language Planning". In Alexandra G, Silk MS (eds.). Standard languages and language standards: Greek, past and present. Ashgate Publishing. p. 188. ISBN 0-7546-6437-6.{{cite book}}
: CS1 maint: extra punctuation (link)
సైప్రస్ అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ " అని పిలువబడుతుంది. ఇది తూర్పు మధ్యధరా సముద్రంలో ఉంది.
Cyprus (/ˈsaɪprəs/ ( listen); Greek: Κύπρος మూస:IPA-el; మూస:Lang-tr మూస:IPA-tr), officially the Republic of Cyprus (Greek: Κυπριακή Δημοκρατία; మూస:Lang-tr), is an island country in the Eastern Mediterranean Sea, off the coasts of Syria and Turkey.[lower-alpha 1] మధ్యధరా సముద్రంలోని జనసాంధ్రత అధికంగా కలిగిన ద్వీపాలలో సైప్రస్ మూడవ స్థానంలో ఉంది. సైప్రస్ యురేపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉంది. సైప్రస్ టర్కీ దేశానికి దక్షిణంలో, సిరియా, లెబనాన్ దేశాలకు పశ్చిమంలో, ఇజ్రాయిల్ దేశానికి వాయవ్యంలో, ఈజిప్ట్ దేశానికి ఉత్తరంలో, గ్రీకు దేశానికి తూర్పు దిశలో ఉంది. చరిత్రకాలానికి ముందు సైప్రస్ ప్రాంతంలో క్రీ.పూ 10 వ శతాబ్దంలో మానవుల నివాసం ఆరంభం అయింది. ఈ కాలానికి చెందిన చక్కగా భద్రపరచబడిన నియోలిథిక్ ఆర్కియాలజీ అవశేషాలు ఖిరొకితియా గ్రామంలో లభించాయి. అత్యంత పురాతనమైన నీటి బావులకు సైప్రస్ నిలయం.
[7]
క్రీ.పూ 2 వ సహస్రాబ్ధిలో సైప్రస్ ప్రాంతంలో మైసెనయీన్ గ్రీకుప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. మధ్యధరా సముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న సైప్రస్ పలు సామ్రాజ్యాల దాడికి గురైంది. వీటిలో నియో అస్సిరియన్, పురాతన ఈజిప్ట్, అచమనిద్ సామ్రాజ్యాలు ప్రధానమైనవి. క్రీ.పూ 333 లో మహావీరుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. తరువాత టోలెమిక్ ఈజిప్ట్, రోమన్ సామ్రాజ్యం, బైజాన్టిన్ సామ్రాజ్యాలు, అరబ్ సంస్థానాధీశులు కొతకాలం ఈప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. మూడు శతాబ్ధాల (1571-1878)ఒట్టోమన్ పాలన తరువాత సైప్రస్లో ఫ్రెంచ్ ల్యూసింగ్నన్ సామ్రాజ్యం, వెనిస్ రిపబ్లిక్ పరిపాలన కొనసాగింది.[8] 1878 నుండి సైప్రస్ బ్రిటిష్ ఆధీనంలోకి మారింది 1914 లో చట్టబద్ధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. 1950లో సైప్రస్ దేశంలో 18% మాత్రమే ఉన్న టర్కిష్ సైప్రియాట్ నాయకులు సైప్రస్ను టర్కీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు.[9][10] అధికసంఖ్యలో ఉన్న గ్రీక్ సైప్రియాట్ ప్రజలు, సైప్రియాట్ ఆర్థడాక్స్ చర్చి గ్రీకు దేశంతో విలీనం చేయాలని ప్రతిపాదించారు.[11] 1950 లో జరిగిన నేషనలిస్ట్ వయలెంస్ తరువాత సైప్రస్ స్వతంత్ర దేశం అయింది.[12] 1963లో 11 సంవత్సరాలపాటు సాగిన టర్కిష్ - గ్రీక్ జాతికలవరాల కారణంగా 25,000 మంది ప్రాణాలు కోల్పోయారు.[13][14] తరువాత 1963లో టర్కిష్ సైప్రియాట్లకు సైప్రస్ రిపబ్లిక్ ప్రాతినిథ్యం కలిగించిన తరువాత కలవరం ముగింపుకు వచ్చింది. 1974 జూలై 15న గ్రీక్ సైప్రియాట్ నేషనలిస్టులు " సైప్రియాట్ తిరుగుబాటు 1974 " లేవనెత్తారు. [15][16][17][18][19][20][21] అంతర్జాతీయ చట్టాలను అనుసరించి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఈ ద్వీపం సమీప సముద్రజలాల మీద సార్వభౌమత్వం కలిగి ఉంది. బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం ఇందుకు మినహాయింపుగా ఉంది. అయినప్పటికీ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. 59% భూభాగానికి రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ పూర్తి అధికారం కలిగి ఉంది. ఉత్తర భాగం [22] టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్తన్ సైప్రస్గా ప్రకటించుకుంది. అయినప్పటికీ దానికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ భూభాగాన్ని ఆక్రమిత టర్కీ ప్రాంతంగా మాత్రమే గుర్తిస్తుంది.[23][24][25][26][27] అంతర్జాతీయ చట్టాలు ఆక్రమణను చట్టవిరుద్ధమైనదిగా భావిస్తున్నాయి. సైప్రస్ యురేపియన్ యూనియన్లో సభ్యత్వం పొందిన తరువాత ఇది ఆక్రమిత యురేపియన్ భూభాగంగా యురేపియన్ యూనియన్ భావిస్తుంది.[28] మధ్యధరా ప్రాంతంలో సైప్రస్ గొప్ప పర్యాటక ఆకర్షణగా ఉంది.[29][30][31] ఇది అభివృద్ధి చెందిన దేశం. [32] అత్యున్నత మానవాభివృద్ధి, ఉన్నత ఆదాయం కలిగిన సమాజం [33][34] కలిగిన సైప్రస్ 1961 నుండి " కామన్వెల్త్ దేశాల " సభ్యత్వం కలిగి ఉంది.2004 మే 1న యురేపియన్ యూనియన్లో సభ్యత్వం పొందే వరకు అలీన ఉద్యమానికి నిధిని సమకూరుస్తున్న దేశాలలో ఒకటిగా ఉంది.[35] 2008 జనవరి 1న సైప్రస్ రిపబ్లిక్ యూరో జోన్లో చేరింది.