సూర్యాపేట జిల్లా
From Wikipedia, the free encyclopedia
సూర్యాపేట జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1] 2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ జిల్లా నల్గొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటుంది.