సిక్కుమతం
From Wikipedia, the free encyclopedia
సిక్కు మతం (ఆంగ్లం : Sikhism) (పంజాబీ ਸਿੱਖੀ ), గురునానక్ ప్రబోధనల ఆధారంగా ఏర్పడిన మతం. ఏకేశ్వరోపాసన వీరి అభిమతం. సిక్కు మతంలో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ లేదా ఆది గ్రంథం లేదా ఆది గ్రంథ్. వీరి పవిత్ర క్షేత్రం అమృత్ సర్ లోని స్వర్ణ మందిరం.ఈ మతాన్ని అవలంబించేవారిని సిక్కులు అని సంబోధిస్తారు. వీరు ప్రధానంగా పంజాబు (భారతదేశం, పాకిస్తాన్) లలో నివసిస్తుంటారు., ప్రపంచమంతటా వ్యాపించియున్న సమూహం.[1]