సఖినేటిపల్లి
ఆంధ్ర ప్రదేశ్, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
సఖినేటిపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గ్రామం.
సఖినేటిపల్లి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°24′19″N 81°45′26″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కోనసీమ |
మండలం | సఖినేటిపల్లి |
విస్తీర్ణం | 15.81 కి.మీ2 (6.10 చ. మై) |
జనాభా (2011) | 15,720 |
• జనసాంద్రత | 990/కి.మీ2 (2,600/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 7,908 |
• స్త్రీలు | 7,812 |
• లింగ నిష్పత్తి | 988 |
• నివాసాలు | 4,196 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08862 ) |
పిన్కోడ్ | 533251 |
2011 జనగణన కోడ్ | 587853 |
ఇది సమీప పట్టణమైన నరసాపురం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4196 ఇళ్లతో, 15720 జనాభాతో 1581 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 7908, ఆడవారి సంఖ్య 7812. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 5792 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 166. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587853[2].
ఈ ఊరు గోదావరి నది వశిష్ట పాయ ఒడ్డున ఉండుటంవలన అందాలకు కొరతలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురానికి, సఖినేటిపల్లికి మధ్య గోదావరి మాత్రమే అడ్డు. అందువలన, సఖినేటిపల్లి ప్రాంతములోని వ్యవసాయపు ఉత్పత్తులను, గోదావరి దాటించి, నరసాపురం ద్వారా మిగిలిన ప్రాంతానికి పంపేవారు. ఇప్పుడు నరసాపురం సమీపంలోని చించినాడ వంతెన ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతోంది కనుక సఖినేటిపల్లి ప్రాంతంలో వర్తకం అభివృద్ధి చెందింది. బల్లకట్టు ద్వారా నరసాపురానికి రాకపోకలతో సంబంధం పోలేదు.