శ్రీపెరంబదూర్
From Wikipedia, the free encyclopedia
శ్రీపెరంబుదూర్, భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లాలోని ఒక పట్టణ పంచాయతీ.[1] ఇది జాతీయ రహదారి 4 లో రాజధాని నగరం చెన్నైకి నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంతం వెలుపల, చెన్నై సబర్బన్ ప్రాంతంలో కొంత భాగం.ఇది చెన్నైలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పొరుగు ప్రాంతం. 2000 నుండి శ్రీపెరంబుదూర్ పారిశ్రామికంగా వేగవంతమైన అభివృద్ధి చెందింది. ఇది అత్యంత ప్రముఖ హిందూ వైష్ణవ సాధువులలో ఒకరైన శ్రీరామానుజాచార్యుడు జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో ఇక్కడే హత్యకు గురయ్యాడు.
త్వరిత వాస్తవాలు శ్రీపెరంబదూర్ తిరుపెరంబుదూర్, దేశం ...
శ్రీపెరంబదూర్
తిరుపెరంబుదూర్ | |
---|---|
Coordinates: 12°58′00″N 79°56′42″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | కాంచీపురం |
Elevation | 66 మీ (217 అ.) |
జనాభా (2008) | |
• Total | 2,00,000 |
• Rank | 2 |
భాషలు | |
• అధికారిక | తమిళం |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
Vehicle registration | టిఎన్-87, టిఎన్-21 |
మూసివేయి