పి.శంకరనారాయణ
భాషావేత్త, నిఘంటు కర్త / From Wikipedia, the free encyclopedia
ఆచార్య పాలూరి శంకరనారాయణ భాషావేత్త, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు, రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుడు. శ్రీకాకుళంలో జన్మించారు.మున్సిపల్ హై స్కూల్ లో చదివి అక్కడే కొంతకాలం ఉపాద్యాయునిగా పనిచేశారు.శంకరనారాయణ మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో గణిత శాస్త్ర ఆచార్యుడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రధాన పరీక్షల అధికారిగా కూడా పనిచేశాడు. కొచ్చిన్ యువరాజులు, యుక్తవయసులో ఉన్న పిఠాపురం రాజా వంటి వారికి విద్యాబోధన చేశాడు. శంకరనారాయణ రచించిన తెలుగు-ఇంగ్లీషు, తమిళం-ఇంగ్లీషు నిఘంటువు చాలా ప్రసిద్ధిచెందినది. శంకర నారాయణగా పేరొందిన ఈయన పూర్తిపేరు పాలూరి శంకరనారాయణ శ్రేష్ఠి. ఈయన తొలి ఇంగ్లీషు తెలుగు నిఘంటువును తయారు చేశారు. దాని పేరే శంకరనారాయణ నిఘంటువు.
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
సొంతూరు నెల్లూరు., కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రి లాగానే దుబాసీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. ఆ రోజుల్లోనే ఆయన ఉద్యోగాల కోసం ఊరు వదలిన మహాసాహసి. రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి, ఇంగ్లీషు తెలుగు నిఘంటువుని తయారు చేశారు. అంతే కాదు, ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ నిఘంటువులను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు నిఘంటువు కూడా తయారు చేశారు.
ఆయన తయారుచేసిన తెలుగు నిఘంటువు 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ నిఘంటువు. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ నిఘంటువు. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ నిఘంటువుయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. 2004 అక్టోబరులో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.
కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన నిఘంటువు పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ నిఘంటువు అంటే ప్రామాణికమే.