వైశాలి జిల్లా
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో జిల్లాలలో వైశాలి జిల్లా (హిందీ:) ఒకటి. వైశాలి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. వైశాలి పురాతకాలానికి చెందిన ప్రాంతం అని భావిస్తున్నారు. వైశాలి జిల్లా తిరుహట్ డివిజన్లో భాగం. మాహాభారతంలో ఈ ప్రాంతం ప్రస్తావించబడింది. ఈ ప్రాంతం బౌద్ధులకు, జైనులకు కూడా పవిత్రమైనదిగా ఉంది. జిల్లావైశాల్యం .... చ.కి.మీ.[1]
వైశాలి జిల్లా
वैशाली जिला ضلع ویشالی | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | తిర్హుత్ |
ముఖ్య పట్టణం | హాజీపూర్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | హాజీపూర్, వైశాలి |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,036 కి.మీ2 (786 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,95,249 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,400/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.56 % |
• లింగ నిష్పత్తి | 892 |
ప్రధాన రహదార్లు | NH 19, NH 77, NH 103 |
Website | అధికారిక జాలస్థలి |
రామాయణ కాలంలో ఈ ప్రాంతాన్ని రాజా వైశాల్ పాలించాడని అందుకే ఇది వైశాలి అయిందని పురాణకథనాలు వువరిస్తున్నాయి. బుద్ధిజం, జౌనిజం ఆరంభానికి ముందే వైశాలి విబ్రంత్ రిపబ్లిక్ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 599 లో మహావీరుడు జన్మించక ముందే రిపబ్లిక్గా ఉన్న విబ్రంత్ ప్రపంచంలో మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. తరువాత పురాతన గ్రీసులో ప్రజారాజ్య పాలన ఆదంభం అయింది.[2] ఆరోజులలో విశాలి ఒక మహానగరం, విశాలరాజ్యానికి రాజధానిగా ఉండేది. హిమాలయాలలోని గంగాభూభాగంలో ఉండేది. (ప్రస్తుత బీహార్ రాష్ట్రం) పురాతన వైశాలి గురించి స్వల్పంగా మాత్రమే వివరాలు లభిస్తున్నాయి. విష్ణుపురాణం వైశాలి రాజ్యానికి సంబంధించిన 24 రాజుల గురించి వివరిస్తుంది. వీరిలో మొదటి వాడు నాభాగుడు. ఆయన మానవ హక్కుల రక్షణార్ధం సుంహాసనాన్ని విసర్జించి భూమిని దున్నాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. వీరిలో చివరి రాజు సుమతి. సుమతి దశరథుని సమకాలీనుడని విశ్వసిస్తున్నారు.
వైశాలిలోని మహాజనపదాలు పలు బౌద్ధ, జైన గ్రంథాలలో విస్తారంగా ప్రస్తావించబడ్డాయి. లభించిన సమాచారం అనుసరించి క్రీ.పూ 6వ శతాబ్దంలో గౌతమబుద్ధుని పుట్టుకకు మునుపే 563లో ఇక్కడ ప్రజారాజ్యం అవతరించినట్లు తెలుస్తుంది. ఇది ప్రపంచంలోని మొదటి ప్రజారాజ్యంగా గుర్తించబడుతుంది. వైశాలి ప్రజారాజ్యంలో మహావీరుడు జన్మించాడని, గౌతమ బుద్ధుడు తన చివరి ప్రసంగాన్ని వైశాలి నగరంలో చేసాడని ఆ సందర్భంలో తన పరినిర్వాణం గురించి ప్రకటించాడని భావిస్తున్నారు. వైశాలి అమ్రపాలి ప్రాంతమని భావిస్తున్నారు. అమ్రపాలి గొప్ప న్యాయాధికారి, బౌద్ధమత రచయిత, బుద్ధుని శిష్యుడు.
జిల్లాలో అభిషేక్ పుష్కరిణి ఉంది. తరువాత జపాన్ ఆలయం, జపాన్ దేశస్తుడు నిప్పోంజన్ మియోహోజి నిర్మించిన విశ్వశాంతి స్థూపం ఉంది, బుద్ధుని అవశేషాల మీద నిర్మించిన స్థూపం అని భావిస్తున్నారు. అభిషేక్ పుష్కరిణి సమీపంలో ఉన్న స్థూపానికి సంబంధించిన అవశేషాలు లభించాయి. మహాపరినిర్వాణం తరువాత వారు అందుకున్న బుద్ధుని అషులలో ఒక భాగం ఈ స్థూపంలో ఉందని విశ్వసిస్తున్నారు. ఖుషీ నగర్ వద్ద బుద్ధుడు చేసిన చివరి ప్రసంగానికి ఉత్తేజితుడైన లిచ్చావి ఆయనను అనుసరించి వెళ్ళాడు. లిచ్చావీకి బుద్ధుడు తనభిక్షాపాత్రను కానుకగా ఇచ్చి వెనుతిరిగి వెళ్ళమని ఆదేశొంచాడు. అయినప్పటికీ లిచ్చావి వెనుతిరగడానికి నిరాకరించాడు. అప్పుడు బుద్ధుడు ఒక మాయా సరోవరం సృష్టించి లిచ్చావీని వెనుతిరిగేలా చేసాడు. ఆప్రదేశం ప్రస్తుతం దుయోరా లోని కేసరియా అని భావిస్తున్నారు. తరువాత ఇక్కడ అశోకుడు స్థూపం నిర్మించాడు. విశాలి నగరానికి వెలుపల ఉన్న గంగా నదిలో బుద్ధుని ప్రియశిష్యుడు ఆనందా నిర్యాణం చెందాడని భావిస్తున్నారు.
1972లో ముజాఫర్పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి వైశాలి జిల్లాను రూపొందించారు. .[3]
వైశాలి జిల్లా వైశాల్యం 2036 చ.కి.మీ.[4] ఇది స్పెయిన్ దేశంలోని తెనెరైఫ్ వైశల్యానికి సమానం.[5] వైశాలి జిల్లా తిరుహట్ జిల్లాలో భాగం. హజిపూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 1972 అక్టోబరు 12వ తేదీన ముజ్జాఫర్పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి వైశాలి జిల్లాను రూపొందించారు.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో వైశాలి జిల్లా ఒకటి అని గుర్తించింది.[6] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[6]
గ్రామంలో అన్ని మౌలిక వసతులు ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,495,249,[7] |
ఇది దాదాపు. | పనామా దేశ జనసంఖ్యకు సమానం.[8] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[9] |
640 భారతదేశ జిల్లాలలో. | 86 వ స్థానంలో ఉంది.[7] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1717 [7] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 28.58%.[7] |
స్త్రీ పురుష నిష్పత్తి. | |
జాతియ సరాసరి (928) కంటే. | 892:1000 [7] |
అక్షరాస్యత శాతం. | 68.56%.[7] |
జాతియ సరాసరి (72%) కంటే. |
1997లో వైశాలి జిల్లాలో 2 చ.కి.మీ వైశాల్యంలో " బరేలా సలీం అలి జుబ్బ విల్డ్ లైఫ్ శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.