![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c5/Ajanta_Padmapani.jpg/640px-Ajanta_Padmapani.jpg&w=640&q=50)
వాకాటకులు
ప్రాచీన భారతీయ రాజవంశం / From Wikipedia, the free encyclopedia
వాకాటక రాజవంశం సా.శ. 3వ శతాబ్దం మధ్యలో దక్కనులో ఉద్భవించిన పురాతన రాజవంశం. వారి రాజ్యం ఉత్తరాన మాల్వా, గుజరాత్ల దక్షిణపు అంచుల నుండి దక్షిణాన తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్గఢ్ అంచుల వరకు విస్తరించి ఉందని భావిస్తున్నారు. వారు డెక్కన్లోని శాతవాహనుల వారసుల్లో అత్యంత ముఖ్యమైన వారు. ఉత్తర భారతదేశంలోని గుప్తులకు సమకాలికులు. వాకాటక వంశీకులు బ్రాహ్మణులు. [2] [3] [4]
వాకాటక సామ్రాజ్యం | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సా.శ. 250 – సా.శ. 500 | |||||||||||||||||||
![]() South-Asia 350 CE LICCHAVIS GAUDA VARMANS IKSHVAKUS KALABHRAS WESTERN GANGAS KADAMBAS PALLAVAS LITTLE KUSHANS SASANIAN HIND KALINGAS WESTERN SATRAPS SAMATATAS GUPTA EMPIRE KIDARITES KUSHANO- SASANIANS SASANIAN EMPIRE MAPS -500 -150 120 350 500 600 800 1000 1175 1250 1400 1500 సా.శ. 350 నాటికి వాకాటక సామ్రాజ్య విస్తీర్ణం[1] | |||||||||||||||||||
రాజధాని | వత్సగుల్మ (నేటి వాశిమ్) | ||||||||||||||||||
సామాన్య భాషలు | సంస్కృతం ప్రాకృతం | ||||||||||||||||||
మతం | హిందూమతం బౌద్ధం జైనమతం | ||||||||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||||||||
మహారాజ | |||||||||||||||||||
• 250–270 | వింధ్యశక్తి | ||||||||||||||||||
• 270–330 | మొదటి ప్రవరసేనుడు | ||||||||||||||||||
• 475–500 | హరిసేనుడు | ||||||||||||||||||
చారిత్రిక కాలం | Classical India | ||||||||||||||||||
• స్థాపన | సా.శ. 250 | ||||||||||||||||||
• పతనం | సా.శ. 500 | ||||||||||||||||||
| |||||||||||||||||||
Today part of | భారతదేశం |
ఈ వంశ మూలపురుషుడైన వింధ్యశక్తి గురించి చాలా తక్కువగా తెలుసు (సుమారు సా.శ. 250 – 270). అతని కుమారుడు మొదటి ప్రవరసేన పాలనలో రాజ్య విస్తరణ ప్రారంభమైంది. మొదటి ప్రవరసేనుడి తర్వాత వాకాటక రాజవంశం నాలుగు శాఖలుగా విడిపోయిందని భావిస్తున్నారు. వీటిలో రెండు శాఖల గురించి తెలియగా, ఇంకో రెండింటి గురించి తెలియదు. తెలిసిన శాఖలు ప్రవరపుర-నందివర్ధన శాఖ, వత్సగుల్మ శాఖ. గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తెను వాకాటక రాజకుటుంబంలోకి వివాహం చేసాడు. తరువాత వారి మద్దతుతో సా.శ. 4వ శతాబ్దంలో గుజరాత్ను శక సాత్రపుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. వాకాటకుల తరువాత దక్కన్లో బాదామి చాళుక్యులు అధికారంలోకి వచ్చారు. [5] వాకాటకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాలకు పోషకులుగా ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారు నిర్మించిన కట్టడాల్లో వారి వారసత్వం కనిపిస్తుంది. అజంతా గుహలలోని బౌద్ధ విహారాలూ, చైత్యాలు (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) వాకాటక చక్రవర్తి హరిషేన ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి.