లార్డ్స్
From Wikipedia, the free encyclopedia
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, లండన్ సెయింట్ జాన్స్ వుడ్లోని క్రికెట్ మైదానం. దీన్ని సాధారణంగా లార్డ్స్ అని పిలుస్తారు. దాని వ్యవస్థాపకుడు, థామస్ లార్డ్ పేరు దీనికి పెట్టారు. ఇది మేరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్సిసి) యాజమాన్యంలో ఉంది. మిడిల్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB), యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్ (ECC), 2005 ఆగస్టు వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) లకు ఇది నిలయం. లార్డ్స్ను క్రికెట్కు నిలయంగా పిలుస్తారు.[2] ఇక్కడ, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన క్రీడా మ్యూజియం ఉంది.[3]
క్రికెట్కు నిలయం | |||||
మైదాన సమాచారం | |||||
---|---|---|---|---|---|
ప్రదేశం | సెంట్ జాన్స్ వుడ్, లండన్ | ||||
భౌగోళికాంశాలు | 51.5294°N 0.1727°W / 51.5294; -0.1727 | ||||
స్థాపితం | 1814; 210 సంవత్సరాల క్రితం (1814) | ||||
సామర్థ్యం (కెపాసిటీ) | 31,100[1] | ||||
యజమాని | మార్లెబోన్ క్రికెట్ క్లబ్ | ||||
వాడుతున్నవారు | ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్ | ||||
ఎండ్ల పేర్లు | |||||
నర్సరీ ఎండ్ పెవిలియన్ ఎండ్ | |||||
అంతర్జాతీయ సమాచారం | |||||
మొదటి టెస్టు | 1884 జూలై 21–23: ఇంగ్లాండు v ఆస్ట్రేలియా | ||||
చివరి టెస్టు | 2023 జూన్ 28 – జూలై 2: ఇంగ్లాండు v ఆస్ట్రేలియా | ||||
మొదటి ODI | 1972 ఆగస్టు 26: ఇంగ్లాండు v ఆస్ట్రేలియా | ||||
చివరి ODI | 2022జూలై 14: ఇంగ్లాండు v India | ||||
మొదటి T20I | 2009 జూన్ 5: ఇంగ్లాండు v నెదర్లాండ్స్ | ||||
చివరి T20I | 2018 జూలై 29: నేపాల్ v నెదర్లాండ్స్ | ||||
మొదటి WODI | 1976 ఆగస్టు 4: ఇంగ్లాండు v ఆస్ట్రేలియా | ||||
చివరి WODI | 2022 సెప్టెంబరు 24: ఇంగ్లాండు v India | ||||
మొదటి WT20I | 2009 జూన్ 21: ఇంగ్లాండు v న్యూజీలాండ్ | ||||
చివరి WT20I | 2023 జూలై 8: ఇంగ్లాండు v ఆస్ట్రేలియా | ||||
జట్టు సమాచారం | |||||
| |||||
2023 జూలై 8 నాటికి Source: ESPNcricinfo |
ఈరోజున లార్డ్స్, దాని ఒరిజినల్ స్థలంలో లేదు; 1787, 1814 లమధ్య థామస్ లార్డ్ స్థాపించిన మూడు మైదానాలలో ఇది మూడవది. ఇప్పుడు లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్ అని పిలవబడే మొదటి మైదానం ఇప్పుడు డోర్సెట్ స్క్వేర్లో ఉంది. రెండవ మైదానం, లార్డ్స్ మిడిల్ గ్రౌండ్, 1811 నుండి 1813 వరకు వాడారు. దాని అవుట్ఫీల్డ్ గుండా రీజెంట్స్ కెనాల్ నిర్మాణం జరగడంతో దాన్ని వదిలేసారు. ప్రస్తుత లార్డ్స్ మైదానం, మిడిల్ గ్రౌండ్ స్థలానికి వాయవ్యంగా దాదాపు 230 మీటర్ల దూరంలో ఉంది. మైదానంలో 31,100 మంది ప్రేక్షకులు పట్టే సామర్థ్యం ఉంది. ఎమ్సిసి చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలలో భాగంగా 2017, 2022 మధ్య దీని సామర్థ్యం పెరిగింది.