రామకృష్ణ మఠం
ఆధ్యాత్మిక సంస్థ / From Wikipedia, the free encyclopedia
రామకృష్ణ మఠం, అనేది 19వ శతాబ్దానికి చెందిన బెంగాల్కు చెందిన ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన రామక్రిష్ణ మిషన్, ఆయన ప్రియశిష్యుడైన స్వామీ వివేకానంద ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు పశ్చిమ బెంగాల్ లోని బేలూర్ మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను మే 1, 1897లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.[1]