మిస్టర్ పెళ్ళాం
From Wikipedia, the free encyclopedia
మిస్టర్ పెళ్ళాం బాపు రమణల చిత్రం. ఇది 1993లో విడుదలయినది. ఇది ఒక కుటుంబ కథా చిత్రం. ఈ చిత్రంలోని పాత్రకు ఎ.వి.ఎస్.కు నంది ఉత్తమ హాస్య నటుడు పురస్కారం వరించింది. శ్రీ చాముండి చిత్ర పతాకంపై బాపు దర్శకత్వంలో గవర పార్థ సారథి నిర్మించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవానీ సంగీతం అందించాడు. ఈ చిత్రం మిస్టర్ మామ్ నుండి ప్రేరణ పొందింది. బాక్సాఫీస్ వద్ద హిట్టైంది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది.[1][2][3]
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
మిస్టర్ పెళ్ళాం (1993 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | బాపు |
నిర్మాణం | గవర పార్థసార్థి |
తారాగణం | రాజేంద్ర ప్రసాద్, ఆమని |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
ఛాయాగ్రహణం | ఆర్.కె.రాజు |
కూర్పు | కె.ఎన్.రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ చాముండి చిత్ర |
భాష | తెలుగు |
మూసివేయి