మస్జిదె నబవి
From Wikipedia, the free encyclopedia
ప్రవక్తగారి మస్జిద్ ( అరబ్బీ: المسجد النبوی), మదీనా నగరంలో గలదు. ఈ మస్జిద్ ఇస్లాం మతము లోని రెండవ అతిప్రాధాన్యం గల మస్జిద్. మహమ్మదు ప్రవక్త గారి ఆఖరి విశ్రాంతి ప్రదేశము. మస్జిద్-అల్-హరామ్ మొదటి ప్రాధాన్యంగలదైతే, అల్-అఖ్సా మస్జిద్ మూడవ ప్రాధాన్యంగలది.
ఈ మస్జిద్ ను మహమ్మద్ ప్రవక్తగారు తమ అనుయాయులతో కలసి నిర్మించారు. తరువాతి కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యపాలకులు విశాలీకరించారు. ఈమస్జిద్ యొక్క విశేషత దీని సబ్జ్ గుంబద్ పచ్చని గుంబద్. ఇది మస్జిద్ కు మధ్యలో ఉంది. దీనిని (గుంబద్ ను) 1817 లోనిర్మించారు, పచ్చనిరంగుపూత 1839లోనూ పూసారు. దీనిని 'గుంబద్-ఎ-ఖజ్రా' అని 'ప్రవక్తగారి గుంబద్' అనికూడా అంటారు.[1] ప్రారంభ ముస్లింల నాయకులైన అబూబక్ర్ ఉమర్ ల సమాధులు కూడా ఈ మస్జిద్ లోనే ఉన్నాయి.
నిజానికి ఇది మహమ్మదు ప్రవక్త గారి ఇల్లు; మక్కా నుండి మదీనా వలస (హిజ్రత్) వచ్చిన తరువాత ఇక్కడే స్థిరపడ్డారు. ఇదే ప్రదేశంలో మస్జిద్ నిర్మింపబడింది. ఈ మస్జిద్ ప్రథమంగా గాలిబయట మస్జిద్. దీని మూలనిర్మాణ నమూనానే ప్రపంచంలోని మస్జిద్ లలో ఉపయోగించబడింది.
ఈ మస్జిద్ ఒక సామాజిక కేంద్రంగా, న్యాయస్థానంగా, ధార్మిక పాఠశాలగా ఉపయోగపడేది. ఓ చిన్న ఎత్తైన ప్రదేశము ఖురాన్ ఉపదేశకులకు ఉండేది.