ఒడిస్సా లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఒడిషా రాష్ట్రం లోని జిల్లాలలో మయూర్బంజ్ జిల్లా ఒకటి. వైశాల్యపరంగా ఈ జిల్లా ఒడిషాలో అత్యంత పెద్దాదిగా గుర్తించబడుతుంది. బైరపదా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011గణాంకాలను అనుసరించి జనసంఖ్యా పరంగా ఈ జిల్లా 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో గంజాం, కటక్ జిల్లాలు ఉన్నాయి.[1] భౌగోళికంగా మయూర్భంజ్ భూ అంతర్గత జిల్లాగా ఉంది. జిల్లా వైశాల్యం 10,418 చ.కి.మీ. జిల్లా ఈశాన్య సరిహద్దులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మదీనాపూర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సింగ్భుం జిల్లా, నైరుతీ సరిహద్దులో బాలాసోర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కెందుఝార్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో 39% భూభాగం (4049చ.కి.మీ) అరణ్యాలు, కొండలతో నిండి ఉంది. జిల్లాలో 26 మండలాలు, 382 గ్రామపంచాయితీలు, 3945 గ్రామాలు ఉన్నాయి. జిల్లా ఉత్తర మధ్య పీఠభూమి లో భాగంగా ఉంది.
మయూర్భంజ్ జిల్లా
ମୟୁରଭଞ ଜିଲ୍ଲା | ||||
---|---|---|---|---|
జిల్లా | ||||
దేశం | India | |||
రాష్ట్రం | ఒడిశా | |||
ప్రధాన కార్యాలయం | బారిపడ | |||
Government | ||||
• కలెక్టరు | Rajesh Prabhakar Patil | |||
• Member of Lok Sabha | Ramachandra Hansdah BJD | |||
విస్తీర్ణం | ||||
• Total | 10,418 కి.మీ2 (4,022 చ. మై) | |||
Elevation | 559.31 మీ (1,835.01 అ.) | |||
జనాభా (2011) | ||||
• Total | 25,13,895 | |||
• జనసాంద్రత | 241/కి.మీ2 (620/చ. మై.) | |||
భాషలు | ||||
• అధికార | ఒరియా, హిందీ,ఇంగ్లీషు | |||
Time zone | UTC+5:30 (IST) | |||
పిన్కోడ్ | 757 xxx | |||
Vehicle registration | OR-11/OD-11 | |||
లింగ నిష్పత్తి | 1,005 ♂/♀ | |||
అక్షరాస్యత | 63.98% | |||
లోక్సభ నియోజకవర్గం | Mayurbhanj | |||
Vidhan Sabha constituency | 09 | |||
శీతోష్ణస్థితి | Aw (Köppen) | |||
అవపాతం | 1,648.2 మిల్లీమీటర్లు (64.89 అం.) |
జిల్లా సరాసరి వార్షిక వర్షపాతం 1648.20 మి.మీ. ఈ ప్రాతం సముద్రతీరానికి దూరంగా ఉంది. జిల్లాలో ఉప ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంది. వేడి వేసవులు, చలితో కూడిన శీతాకాలం మంచి వర్షపాతం ఉంటాయి. బమంఘాటి, పాంచ్పిర్ పీఠభూమితోచేర్చి జిల్లాలో అధికంగా ఎర్రమట్టి భూములు అధికంగా ఉంటాయి.
మయూర్భంజ్ జిల్లాలో పచ్చని వృక్షాలు అధికంగా ఉన్నాయి. జిల్లా గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగి ఉంది. ఈ ప్రాంతం గతంలో సిమిలిపలి బియోస్ఫేర్ రాజాస్థానం "గా ఉండేది. 1949 జనవరి 1 న రాజాస్థానం ఒడిషా రాష్ట్రంలో కలుపబడింది. తరువాత ఈ ప్రాంతం ఒడిషా రాష్ట్ర జిల్లాలో ఒకటిగా మారింది. జిల్లాలో ఇనుము, వనడిఫెర్రోస్,, టైటాని ఫెర్రోస్ మేగ్నటిక్, చైనా క్లే, గలేనా (లీడ్ (సీసం) గనులు) క్యానైట్, అస్బెస్టాస్, స్టీటైట్ (సోప్స్టోన్), క్వార్ట్జిట్ మొదలైన ఖనిజ సంపద ఉంది. 50 సంవత్సరాలుగా గిరుమహిసని, బదాంపహర్, సులెయిపత్ గనులు దోపిడీకి గురౌతున్నాయి.
మయూర్భంజ్లో శిలాయుగం నుండి మానవులు నివసించారని భావిస్తున్నారు. ప్రాచీన దిగువ శలాయుగానికి సంబంధించిన మానవులు నివంచారనడానికి అవసరమైన ఆధారాలు లభించాయి. ఇక్కడ లభించిన ఆధారాలు ఈ మానవులు ఐరోపాకు చెందిన అచులియన్ తెగకు చెందినవారని తెలియజేస్తున్నాయి. ఈ ఆధారాలు పశ్చిమ బెంగాల్ లోని మదీనాపూర్లో లభించిన ఆధారాలను పోలి ఉన్నాయి. చరిత్రకారుల భావనలో మయూర్భంజ్ అతి ప్రాచీన శలాయుగానికి చెందిన మాననివాసాల సంస్కృతి సంపదతో విలసిల్లిందని భావిస్తున్నారు. ఇలాంటి నాగరికత మదీనాపూర్, దేశంలోని ఇతర భూభాగాలలో కూడా కనిపిస్తుందని భావిస్తున్నారు.
భంజ్ రాజవంశానికి చెందిన రాజుల పాలన సా.శ. 9వ శతాబ్దం వరకు నిరంతరంగా కొనసాగింది. భంజ వంశరాజులు కజింగకోటను రాజధానిగా చేసుకుని కజింగ మండల రాజ్యాన్ని పాలించారు. కజింగ రాజుల తామ్రపత్రాలు కజింగభంజ ప్రస్తుత మయూర్భంజ్, కెందుఝార్ జిల్లాల మద్య అలాగే బీహార్ రాష్ట్రంలోని సింగ్భుం జిల్లాలో కొంతభాగం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని మదీనాపూర్ వరకు విస్తరించి ఉందని భావిస్తున్నారు. మొగల్ పాలనా కాలంలో భంజారాజుల రాజ్యం బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఆసమయంలో భంజ్ రాజధాని కజింగ కోట నుండి హరిపూర్కు మార్చబడింది.
భంజ రాజులకు మయూర్భంజ్ జిల్లా ప్రాంతం కేంద్రంగా ఉండేది. వారికి కెందుజహర్ లోని మయూర్ రాజులతో సత్సంబంధాలు ఉండేవి. మయూర్, భంజ్ వంశాల కలయిక వలన ఈ ప్రాంతానికి మయూర్బని అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతాన్ని భంజా రాజులు దీర్ఘకాలం పాలించారు. ప్రస్తుత ఖిచింగ్ ప్రాంతం మునుపటి భంజ్ రాజధాని అని భావిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని భంజ్ వంశస్థులు 1000 సంవత్సరాల కాలం నిరంతరాయంగా దేశానికి స్వతంత్రం వచ్చే వరకుపాలించారు. భంజ్ రాజ్యాన్ని శిలా భంజ్ అంగడ్డి స్థాపించాడు. ఈ ప్రాంత అభివృద్ధికి భంజా రాజులు పూర్తి బాధ్యత వహించారు. భంజ్ రాజులు ఈప్రాంతంలో కళలు, నిర్మాణకళ, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడ్డారు. వీరి కాలంలో హరిబలదేవ్ ఆలయం, ఖిచింగ్ ఆలయం, మయూర్భని జిల్లా లోపల, చుట్టుపక్కల ప్రాంతాలలో నిర్మించిన ఇతర కట్టాడాలు అందుకు సాక్ష్యంగా నిలిచాయి. భంజ్ రాజులు చౌ నృత్యాన్ని రూపకల్పన చేసి అభివృద్ధి చేసారు. చౌ నృత్యం గిరిజన, యుద్ధ, సంప్రదాయ నృత్యాల కలయికతో ప్రపంచం అంతటా గుర్తింపును కలిగి ఉంది.
బ్రిటిష్ ప్రభుత్వ పాలనా సమయంలో మయూర్భంజ్ రాజులు ఒడిషా అభివృద్ధికి అవసరమైన మార్గదర్శక శక్తిగా వ్యవహరించారు. బ్రిటిష్ పాలనా కాలంలో మయూర్భంజ్ దేశంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాలలో ఒకటిగా గుర్తింపును పొందింది. భంజ్ రాజులు రాష్ట్రంలో మొట్టమొదటి " మెడికల్ కాలేజ్ " కటక్లో స్థాపించారు. భంజ్ రాజులు రావెన్షా కాలేజ్ వంటి విద్యా సంస్థల అభివృద్ధి కొరకు అత్యధిక పెద్ద మొత్తంలో నిధి సహాయం చేసారు. ఒడిషా రాష్ట్రంలో రైలు మార్గం నిర్మించడానికి బ్రిటి ప్రభుత్వాన్ని ఒప్పినడానికి భంజ్ రాజుల ప్రయత్నం గుర్తించతగినదిగా భావిస్తున్నారు.
స్వాతంత్ర్యం తరువాత మహారాజా ప్రతాప్ భంజ్దేవ్ ఆధ్వర్యంలో మయూర్భంజ్ రాజాస్థానం 1949 జనవరి 1 భారతప్రభుత్వంతో విలీనం చేయబడి ఒడిషా భూభాగంతో చేర్చబడింది. ప్రతాప్ భంజ్దేవ్ తండ్రి శ్రీరాం చంద్ర భంజ్ దేవ్ ఒడిషా అభివృద్ధికి, ఒరియా ప్రజల శ్రేయస్సుకు చేసిన కృషి ప్రత్యేక గుర్తింపును పొందింది. రావెన్షా కాలేజ్, ఎస్.సి.బి మెడికల్ కాలేజ్ ఆయన చేసిన గుర్తించతగిన సేవకు నిదర్శనంగా ఉన్నాయి. ఆయన పాలనా సమయంలో భరతదేశ మొదటి ఇనుప గనులైన గురుమహిసని, బదంపహర్, సులెయిపత్ (ఇవి టిస్కో మాతృ గనులుగా గుర్తించబడుతున్నాయి ) టాటా సంస్థకు లీజుకు ఇవ్వబడ్డాయి.
మయూర్భంజ్ జిల్లా ఆర్థికరంగం అధికంగా వ్యవసాయ ఆధారితం. వ్యవసాయ అనుకూల భూభాగం, వ్యవసాయ అనుకూలమైన భూమి వ్యవసాయాభివృద్ధికి ప్రేరణ కలిగిస్తుంది. జిల్లాలో వడ్లు అధికంగా పండించబడుతున్నాయి. నూనె గింజలు, పప్పుధాన్యాలు తరువాత స్థానంలో ఉన్నాయి. ఎగువభూములలో కరీఫ్ వరిపంట తగ్గుతూ వస్తుంది. అదేసమయంలో పప్పులు, నూనె గింజలు,, ఇతర ధాన్యాలు అధికరిస్తున్నాయి. భూసారం అనుసరించి పంటవిధానంలో మార్పులు జరుగుతుంటాయి.
చిన్నతరాహా పరిశ్రమలు అధికంగా ఉన్నందున ఖనిజాలు నలుగకొట్టడం, రాళ్ళు పగులకొట్టడం, చైనా క్లే వాషింగ్, సెరామిక్ ఇండస్ట్రీస్, ఎరువులు, సేఫ్టీ మ్యాచెస్, పేరర్ మిల్లులు, పెయింట్లు, కెమికల్స్, వాషింగ్ సోప్, ఎలెక్ట్రికల్ వస్తువులు, హైవోల్టేజ్ కేబుల్ తయారీ, అల్యూమినియం యుటెంసిల్స్, కోల్డ్ స్టోరేజ్, మెకానైజ్డ్ హాచరీ, జనరల్ ఫ్యాబ్రికేషన్, షీట్ - మెటల్స్, పాలీ - లీఫ్ కప్పులు, ప్లేట్ తయారీ, సిమెంట్ ఉత్పత్తులు, సబై ఉత్పత్తులు, రైస్ హుల్లర్, పిండి మరలు, అలైడ్ రిపేరింగ్ సర్వీసెస్ మొదలైనవి మయూర్భంజ్ ఆర్థిక రంగానికి చేయూత ఇస్తుంది.
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మయూర్భంజ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఒడిషా రాష్ట్ర 19 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,513,895,[1] |
ఇది దాదాపు. | కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెవాడా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 171 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 241 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.06%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 1006:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 63.98%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మయూర్భంజ్ ప్రజాజీవితాలలో సంస్కృతి లోతుగా వేళ్ళూనింది. వైభవోపేతం, సుసంపాన్నమైన మయూర్భంజ్ సంస్కృతి ఒడిషా రాష్ట్రానికి ప్రత్యేకత తీసుకు వస్తుంది. మకర్ పర్వ, కర్మ పర్వ ఉత్సవాలను ప్రజలు ఉత్సాహంగా జరౌకుంటారు. మయూర్భంజ్ అత్యంత అనదమైన ప్రకృతి దృశ్యాలకు ఆలవాలంగా ఉంది. సునదర ప్రకృతి మద్య ప్రదర్శించబడే చౌనృత్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ నృత్యరూపం అంతర్జాతీయంగా పేతుప్రతిష్ఠలు సాధించింది. ఇది తన సౌందర్యం, తేజస్సు, అద్భుత శైలికి గుర్తింపు పొందింది. ఝుమర్ అనే ప్రబల జానపద గీతం మయూర్భంజ్ ప్రజా జీవితాలాలో అనివార్యభాగంగా మారింది. ఈ గీతాలను ఉత్సవాలలో, వివాహాలలో, ఇతర సాంఘిక ఉత్సవాలలో, దుఃఖంలో, సంతోషంలో కూడా ఆలపుస్తుంటారు.
మయూర్భంజ్ సంపన్న సంస్కృతి వారసత్వంలో హస్థకళలు కూడా ప్రధాన్యత కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కళలో కాలానుగత మార్పులు చోటు చేకునుటున్నాయి. ఈ ప్రాంతంలో ప్రజాజీవితంలో దనసరి అవసరాలకు అనుగుణంగా మారుతూ వస్తుంది. ఇది ప్రజలలోని కళాతృష్ణను తృప్తి పరచడానికి, కళాకారుల నైపుణ్యం వెలిబుచ్చడానికి సహకరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో హస్థకళలను దైనందిక జీవితాలలో వస్తువులకు అందాలను చేకూర్చడానికి ఉపయోగించుకుంటారు. ఇలా చేయడం జీవితాన్ని ఆసక్తికరంగా వర్ణమయంగా చేయడానికి సహకరిస్తుంది. హస్థకళలకు నిరంతర ప్రోత్సాహం ఉంటుంది.
తరువాతి కాలంలో జిల్లాలో హస్థకళలకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది. ప్రజాజీవితంలో ఆధునికత ప్రవేశించడం, ఫ్యాక్టరీ వస్తువుల ఉపయోగం అధికరించడం వలన హస్థకళలకు క్షీణదశ ఆరంభం అయింది. ఈ ప్రాతంలో హస్థకళలకు సరికొత్త గిరాకి తీసుకురావడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. ఫలితంగా వసువుల నాణ్యత, డిజైన్, సాంకేతికత వంటి విషయాలలో మార్పులు సంభవించాయి. అదేసమయం శైలిలో, రూపం, వర్ణాలు మాత్రం ఎప్పటిలా శతాబ్ధాల సంప్రదాయాన్ని అలాగే కాపాడబడుతున్నారు. ప్రస్తుతం కస్థకళాకారులకు ఆధునికత చొప్పిస్తూ, సంప్రదాయం అనుసరిస్తూ, పాతపద్ధతులను సరక్షించిస్తూ హస్థకళళా ఖండాలను తయారు చేయడంలో శిక్షణ ఇస్తున్నారు.
మయూర్భంజ్లో పలు పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. " సిమిలిపల్ నేషనల్ పార్క్" పులుల అభయారణ్యం అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది. 1960లో టైగర్ రిజర్వ్ డైరెక్టర్ ఖైరి అనే ఆడ పులిని దత్తత చేసుకున్న తరుణంలో ఈ అభయారణ్యం అంతర్జాతీయ గుర్తింపును పొందింది. బంగ్రిపొసిలో ప్రబల దుయర్సుని ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో మనోహరమైన చిన్న చిన్న అరణ్యాలు ఉన్నాయి. ఈ అభయారణ్యం ఎవరినైనా ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఆలయ ప్రాంగణంలో అత్యుత్సాహంగా " మకర సంక్రాంతి "పండుగ జరుపుకుంటారు.
ముధి (బొరుగులు) మయూర్భంజ్ ప్రజల అభిమాన ఆహారంగా ఉంది. మరొక అభిమాన ఆహారం " పఖల ".
(ప్రధాన గిరిజన సంఘం సంతల్ కోసం ఒక లిపి ఉంది ఏ) OL-చికి
A national park for tigers and other wildlife, known as Simlipal National Park, is in Mayurbhanj district.
The following is the nine Vidhan sabha constituencies[5][6] of Mayurbhanj district and the elected members[7] of that area
క్ర.సం | నియోజకవర్గం | రిజర్వేషను | పరిధి | 14 వ శాసనసభ సభ్యులు | పార్టీ |
---|---|---|---|---|---|
26 | జషిపూర్ | షెడ్యూల్డ్ తెగలు | జషిపూర్, రరుయాన్, శుక్రుయిల్, కుసుమి (భాగం) | కమల కాంతా నాయక్ | బి.జె.డి |
27 | సరస్కన | షెడ్యూల్డ్ తెగలు | సరస్కన, బిజతల, బిసొయి, కుసుమి (భాగం) | రామ చంద్రా హంసద్ | బి.జె.డి |
28 | రైరంగ్పూర్ | షెడ్యూల్డ్ తెగలు | రైరంగ్పూర్ (ఎన్.ఎ.సి), రైరంగ్పూర్, తిరింగి, బహల్ద, జంద. | శ్యాం చరణ్ హంసద్ | ఐ.ఎన్.సి |
29 | బంగ్రిపొసి | షెడ్యూల్డ్ తెగలు | బంగ్రిపొసి, కులియానా, షమకుంట | సుధాం మతండి | బి.జె.డి |
30 | కరంజియా | షెడ్యూల్డ్ తెగలు | కతంజియా (ఎన్.ఎ.సి), కరంజియా, థాకూర్ముండ, కప్తిపద (భాగం) | బిజయ్ కుమార్ నాయక్ | BJD |
31 | ఉదల | షెడ్యూల్డ్ తెగలు | ఉదల (ఎన్.ఎ.సి), ఉదల, గోపబధునగర్, కప్తిపద (భాగం) | శ్రీనాథ్ సొరెన్ | బి.జె.డి |
32 | బదసహి | షెడ్యూల్డ్ కులాలు | బెట్నోటి, బదసహి (భాగం) | మనోరంజన్ | బి.జె.పి |
33 | బరిపద | షెడ్యూల్డ్ తెగలు | బరిపద (ఎం), బరిపద, ఖుంట, బదసహి (భాగం) | సనంద మరండి | బి.జె.డి |
34 | మొరద | లేదు | మొరద, సులియాపద, రాస్గొబిందపూర్ | ప్రవీన్ చంద్ర భంజ్ దేవ్. | బి.జె.డి |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.