భీష్మ పర్వము
From Wikipedia, the free encyclopedia
భీష్మ పర్వము, మహాభారతంలోని ఆరవ భాగము. ఈ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం ఆరంభమవుతుంది. భీష్ముని నాయకత్వంలో జరిగిన పది రోజుల యుద్ధం భీష్మపర్వంలో ఉన్నది. భగవద్గీత ఈ పర్వంలో ఒక భాగం. పర్వం ఆరంభంలో వ్యాసుడు యుద్ధాన్ని ఆపుజేయమని ధృతరాష్ట్రునికి బోధిస్తాడు కాని ఆ ప్రయత్నం ఫలించదు. ఇక యుద్ధాన్ని చూడడానికి సంజయునికి అతీంద్రియ శక్తులను ప్రసాదిస్తాడు వ్యాసుడు. ఆ శక్తుల ద్వారా తాను చూసిన యుద్ధాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణిస్తూ ఉంటాడు.భీష్ముడు పదవనాటి యుద్ధంలో నేలకు ఒరిగి అంపశయ్యపై చేరడంతో ఈ పర్వం ముగుస్తుంది.