దుర్గా దేవి (సంస్కృతం: दुर्गा) ప్రధాన హిందూ దేవత.రాక్షసులను సంహరించడానికి మూల ప్రకృతి అయిన మహాలక్ష్మి దేవి (మహాదేవి) వివిధ రూపాలను తీసుకుంటుంది.మహాలక్ష్మి యొక్క వివిధ రూపాలలో దుర్గాదేవి ఒకటి.దేవీ మహాత్మ్యం ప్రకారం జగన్మాత మహాలక్ష్మి దేవి మహిషాసుర అనే రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది.

త్వరిత వాస్తవాలు దుర్గ, ఇతర పేర్లు ...
దుర్గ
Thumb
18వ శతాబ్దపు దుర్గ మహిషాసురుడుని వధిస్తున్న పెయింటింగ్
ధైర్యం యొక్క దేవత, శ్రేయస్సు యొక్క దేవత, విధ్వంసం యొక్క దేవత, ప్రేమ మరియు కరుణ యొక్క దేవత
ఇతర పేర్లుమహిషాసురమర్దిని ,మహాలక్ష్మి దేవి
అనుబంధం
  • మహాదేవి(మహాలక్ష్మిదేవి)
నివాసంవైకుంఠం లేదా మణిద్వీపం
మంత్రం.ఓం శ్రీ దుర్గాయై నమః .సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఆయుధములుసుదర్శన చక్రం, శంఖం, త్రిశూలం, గద, విల్లు , బాణం, ఖడ్గం షీల్డ్,
భర్త / భార్యవిష్ణు భగవానుడు
వాహనంసింహo
పాఠ్యగ్రంథాలుమార్కండేయ మహాపురాణం దేవీ మహాత్మ్యం, దేవీ భాగవతం, గరుడ మహాపురాణం, దేవీ సూక్తం
పండుగలుశరణ్ నవరాత్రి
మూసివేయి

దుర్గాదేవి కథ

దుర్గా కథ మార్కెండయ మహాపురాణంలోని దేవీ మహాత్మ్యంలో ఉంది. మహిషాసురుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం కలిగి ఉన్నాడు, అతను కన్య స్త్రీల ద్వారా మాత్రమే చంపబడతాడు. దాని కారణంగా అతను అహంకారం పెంచుకున్నాడు, ఋషులు, దేవతలను భంగపరచడం ప్రారంభించాడు, అతను దేవతలతో పోరాడాడు. అతను స్వర్గానికి రాజు అయ్యాడు, అతను దేవతలను తన బానిసలుగా చేసుకున్నాడు. దేవతలు అక్కడి నుండి తప్పించుకొని బ్రహ్మదేవునితో వైకుంఠానికి చేరుకున్నారు. విష్ణుభగవానుడు వైకుంఠంలో శివునితో మాట్లాడుతుండగా, దేవతలు విష్ణుభగవానుని సమీపించగా, అక్కడ జరిగినదంతా చెప్పారు.అప్పుడు విష్ణుభగవానుడు చాలా కోపంగా ఉన్నాడు, అతని కోపం నుండి, కనుబొమ్మల నుండి ఒక దివ్యశక్తి బయటికి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతల శక్తులు బయటికి వచ్చి విష్ణుభగవానుడి దివ్య శక్తిలో కలిసిపోయాయి. దివ్యశక్తి దేవీ రూపాన్ని సంతరించుకుంది.వాస్తవానికి మహావిష్ణువు తప్ప దేవతలు శక్తి కోసం మహాలక్ష్మి దేవిపై ఆధారపడతారు. కాబట్టి మహాలక్ష్మి నిర్దిష్ట రూపంలో శక్తిని నిర్దిష్ట దేవతకు అందజేస్తుంది.మరియు మహాలక్ష్మీ దేవి యొక్క ప్రత్యేక రూపం ప్రత్యేక దేవత యొక్క శక్తిగా చెప్పబడింది.ఇక్కడ శక్తి అంటే శక్తిని ప్రదాత అని అర్థం .అలా శక్తి ప్రదాత అయిన శక్తులు వైష్ణవి అనే విష్ణుశక్తిలో కలిసిపోయాయి.నిజానికి శక్తులు మహాలక్ష్మి దేవి అవతారాలు, కాబట్టి శక్తి అవతారాలన్నీ వైష్ణవి శక్తిలో కలిసిపోయి అందమైన దేవి రూపాన్ని పొందాయి.ఆ దేవికి 18 చేతులు ఉన్నాయి .దేవతలు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించమని దేవిని అభ్యర్థించారు. వారు తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు, హిమవాన్ ఆమెకు సింహాన్ని ఇచ్చాడు. ఆ విధంగా దేవి దేవతల కోరికను అంగీకరించి, మహిషాసురుడిని సంహరించడానికి అతని దగ్గరికి వెళ్ళింది.మహిషాసురుడు దేవి అందాన్ని చూసి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు, అయితే దేవి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే యుద్ధంలో నాపై గెలవాలి అని చెప్పింది. అలా దేవికి, మహిషాసురుడికి మధ్య యుద్ధం జరిగింది.దేవి మహిషాసురుడు, అతని సైన్యాలతో 9 రోజుల వరకు యుద్ధం చేసింది. ఆ విధంగా దశమి రోజున ఆమె మహిషాసురుని సంహరించింది. ఈ దేవి అడ్డంకులను తొలగించేది కనుక దుర్గా అని కూడా పిలువబడుతుంది, ఆమె దుర్గామాసురుడు అనే అసురుడిని కూడా వధించింది, కాబట్టి దుర్గ దుర్గమాసురుని సంహరించిన వ్యక్తిని కూడా సూచిస్తుంది. అదే దేవి మహిషాసురుడిని సంహరించింది, కాబట్టి ఆమెకు మహిషాసుర మర్ధిని అనే పేరు వచ్చింది.మరియు ఈ దేవి అసలు పేరు మహాలక్ష్మి దేవి, ఈ దేవి యొక్క ఇతర పేర్లు దుర్గ, మహిషాసుర మర్ధిని.

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.