భాగవతం - ఒకటవ స్కంధము
From Wikipedia, the free encyclopedia
భాగవతము ఋషుల ప్రశ్నలతో మొదలవుతుంది. [1]తరువాత భాగవతము లోని వివిధ అవతారములను గురించి వివరించారు. అటు పిమ్మట భాగవతము ఎలా మొదలైనదో వివరింపబడింది. వేదాలు విభజించి, మహాభారతం రచించి, 17 (17) పురాణాలు రాసి కూడా వ్యాసభగవానునికి మనశ్శాంతి లేకుండా పోయింది. అప్పుడు వారి ఆధ్యాత్మిక గురువు గారు అయిన నారద మహర్షి విచ్చేసిభాగవతము రాయమని ఉపదేశించి, అనేక విషయాలు బోధించి వెళతారు. అప్పుడు వ్యాసులవారు ఈ భాగవతము రాస్తారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భాగవతం![]() | |||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
తరువాత ఈ భాగవతాన్ని ఎలా ప్రచారములోనికి తెచ్చినారో వివరింపబడింది. మహాభారతము ముగియడము, పరిక్షిత్తు మినహా అందరూ పరమ పదము చేరుకోవడము, భీష్ముని నిర్యాణము, శ్రీ కృష్ణ భగవానుని ద్వారకా ప్రయాణము, ద్వారకలో వారు ప్రవేశించడము, పరిక్షిత్తు జననము, దృతరాష్ట్రుడు అడవులకి వెళ్ళడము, శ్రీ కృష్ణ నిర్యాణము, పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళడము, పరిక్షిత్తు, కలి సంవాదము, పరిక్షిత్తు కలి పురుషుడుని దండించడము, దయచూపడము, పరిక్షిత్తుకి బ్రాహ్మణ బాలుడు శాపాన్ని ఒసగడము, శుకదేవ మహర్షి ఆగమనము, పరిక్షిత్తు వారిని ప్రశ్నలు అడగటము అనే వివరములు ఈ ప్రథమ స్కంధములో గలవు .[2]