పంజాబ్ (పాకిస్తాన్)
From Wikipedia, the free encyclopedia
పంజాబ్ (ఉర్దూ, పంజాబీ: پنجاب, పంజ్-ఆబ్, "ఐదు జలాలు": listen (help·info)), పాకిస్తాన్ యొక్క 4 ప్రావిన్సుల్లో అత్యధిక జనాభా కలిగిన ప్రావిన్సు. 205344 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 91,379,615 (2011 నాటికి) మంది జనాభాతో,[6] దేశ జనాభాలో దాదాపు 56 శాతం కలిగివుంది. దీని ప్రావిన్షియల్ రాజధాని లాహోర్. పంజాబ్ రాష్ట్రం భారతీయ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీరును ఈశాన్యంలో, రాజస్థాన్, భారత దేశపు పంజాబ్ లను తూర్పున సరిహద్దుగా కలిగివుంది. పాకిస్తాన్ లో దక్షిణాన సింధ్, పశ్చిమాన బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వా, ఉత్తరాన ఇస్లామాబాద్, P.O.K ప్రాంతాలను సరిహద్దులుగా కలిగుంది.[7][8]
పంజాబ్
پنجاب | ||||||
---|---|---|---|---|---|---|
ప్రావిన్సు | ||||||
Left to right: Badshahi Mosque, Noor Mahal, Tomb of Shah Rukn-e-Alam, and Clock Tower, Faisalabad | ||||||
Nickname(s): ఐదు నదుల ప్రాంతం (పర్షియన్: పంజ్- ఐదు, ఆబ్- నీరు/నదులు) | ||||||
దేశం | పాకిస్తాన్ | |||||
స్థాపితం | 1 జూలై 1970 | |||||
రాజధాని | దస్త్రం:Lahore Emblem.png లాహోర్ | |||||
అతిపెద్ద నగరం | దస్త్రం:Lahore Emblem.png లాహోర్ | |||||
Government | ||||||
• Type | ప్రావిన్సు | |||||
• Body | ప్రావిన్షియల్ ప్రభుత్వం | |||||
• గవర్నర్ | మాలిక్ మహమ్మద్ రఫీక్ రజ్వానా[1] (పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్)) | |||||
• ముఖ్యమంత్రి | షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) | |||||
• హైకోర్టు | లాహోర్ హైకోర్టు | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 2,05,344 కి.మీ2 (79,284 చ. మై) | |||||
జనాభా (2015)[2] | ||||||
• Total | 10,13,91,000 | |||||
• జనసాంద్రత | 490/కి.మీ2 (1,300/చ. మై.) | |||||
Time zone | UTC+5 (పికెటి) | |||||
ISO 3166 code | PK-PB | |||||
ప్రధాన భాషలు |
| |||||
అసెంబ్లీ సీట్లు | 371[3] | |||||
జిల్లాలు | 36 | |||||
తహశీళ్ళు లేదా పట్టణాలు | 127 |
భారతీయ రాష్ట్రాలైన హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లతో కలిపి ప్రావిన్సు అత్యంత సారవంతమైన పంజాబ్ ప్రాంతంలోని భాగం. ఈ ప్రాచీనమైన ప్రాంతాన్ని భారతదేశ విభజన సమయంలో విభజించారు, ముస్లిం మతస్థుల సంఖ్యాధిక్యత కలిగిన ప్రాంతాలు పాకీస్తానీ ప్రావిన్సులోకి చేరగా, ముస్లిమేతరుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలు భారతదేశంలో భాగంగా ఉండిపోయాయి.
పంజాబ్ భౌగోళికంగా సింధు నది, పాకిస్తాన్ లోని దాని 4 ముఖ్య ఉపనదులైన జీలం, చినాబ్, రావి, సట్లెజ్ నదుల వల్ల సారవంతమైన మైదానాలు ప్రధానంగా కలిగివుంది. ప్రావిన్స్ యొక్క నైరుతి భాగంలోని సులేమాన్ పర్వతాలు, తూర్పున ఉన్న మార్గెల్లా కొండలు, సాల్ట్ శ్రేణి, పోతోహార్ పీఠభూమి వంటి కొండ ప్రాంతాలూ ఉన్నాయి. పంజాబ్ లో ఆదాయం, ఉపాధిలకు వ్యవసాయం ప్రధానమైన ఆధారం; గోధుమ, పత్తి ప్రధాన పంటలు. స్వతంత్రం వచ్చిననాటి నుంచి పంజాబ్ పాకిస్తాన్లో అధికారం, ఆర్థిక వ్యవస్థలకు కీలక స్థానంగా ఉంది; పాకిస్తాన్ లో అతిఎక్కువ పారిశ్రామికీకరణ జరిగిన ప్రావిన్సుగా నిలుస్తోంది. దేశంలోని 39.2 శాతం భారీ తరహా, 70 శాతం చిన్నతరహా తయారీ పరిశ్రమలు ప్రావిన్సులో నెలకొన్నాయి.[9] దీని రాజధాని లాహోర్ ప్రధానమైన స్థానిక సంస్కృతీ, చారిత్రక, ఆర్థిక కేంద్రం.[10]