నామదేవుడు
From Wikipedia, the free encyclopedia
నామదేవుడు (సా.శ. 1270 – 1350) మహారాష్ట్రకు చెందిన వాగ్గేయకారుడు. వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖుడు. ఇతను జీవితం పై అనేక అస్పష్టతలున్నాయి. అతను మరణించిన కొన్ని శతాబ్దాల తరువాత అనేక అద్భుత సంఘటనలతో కూడిన జీవిత కథలు చాలా వచ్చాయి. కానీ పండితులు ఇందులో సమాచారం ఒకదానితో ఒకటి పొందికలేకుండా ఉందని అభిప్రాయపడ్డారు.[1]
త్వరిత వాస్తవాలు సంత్ నామదేవ్, జననం ...
సంత్ నామదేవ్ | |
---|---|
జననం | సుమారు 1270 CE మహారాష్ట్ర |
నిర్యాణము | సుమారు 1350 CE వివాదాస్పదం |
తత్వం | వర్కారీ |
సాహిత్య రచనలు | అభంగాలు |
మూసివేయి
నామదేవుడు వైష్ణవ సాంప్రదాయంచే ప్రభావితం అయ్యాడు. అతను రాసిన అనేక గీతాలు భజన పాటలుగా ప్రాచుర్యం పొందాయి. అతను పాటల్లో ముఖ్యంగా ఏకేశ్వరోపాసన, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ తత్వాలు కనిపిస్తాయి. మిగతా గురువులతో కలిసి అతను ప్రారంభించిన వార్కరీ సాంప్రదాయం ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సాంప్రదాయం ప్రకారం దక్షిణ మహారాష్ట్రలో సంవత్సరానికి రెండు సార్లు భక్తులు సామూహికంగా పండరీపురానికి పాదయాత్ర చేస్తారు. [2][3]