అభంగాలు
From Wikipedia, the free encyclopedia
అభంగాలు అంటే మహారాష్ట్రలోని పండరీపురంలో వెలసిన విఠోబా దేవుని కీర్తిస్తూ రాసిన దివ్య కవిత్వం. అభంగం అంటే అంతం లేనిది అని అర్థం.[1] భజనలు అంతరాత్మలోకి ప్రయాణానికి నిర్దేశించినవైతే అభంగాలు ముఖ్యంగా భయట సమాజంతో అనుభవాలను క్రోడీకరించి రాసినవి.[2] పండరీపురానికి వెళ్ళే భక్తులు ఈ అభంగాలను గానం చేస్తూ వెళుతుంటారు. భజనలు చేసేవారే కాక వీటిని దక్షిణ, ఉత్తర భారత సంగీత సంప్రదాయాల ప్రకారం స్వరపరచి శాస్త్రీయ సంగీత కళాకారులు కూడా గానం చేస్తుంటారు. మహారాష్ట్రలో భక్తి సంప్రదాయాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన జ్ఞానేశ్వరుడు, నామదేవుడు, తుకారాం మొదలైన వారు అభంగాలను రచించారు.