తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మరియు రెండవ గవర్నర్. / From Wikipedia, the free encyclopedia
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్. ఈమె తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు.[2] తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్గా భాద్యతలు చేపట్టింది.[3][4][5]తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్కు పుదుచ్చేరి గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఫిబ్రవరి 2021లో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశాడు. ఆమె కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా 18 ఫిబ్రవరి 2021న భాద్యతలు చేపట్టింది.[6][7]
తమిళిసై సౌందరరాజన్ | |||
పదవీ కాలం సెప్టెంబర్ 8, 2019 - 2024 మార్చి 19 | |||
ముందు | ఈ.ఎస్.ఎల్.నరసింహన్ | ||
---|---|---|---|
తరువాత | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | జూన్ 2, 1961 నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం | ||
తల్లిదండ్రులు | కుమరి అనంతన్, కృష్ణకుమారి [1] | ||
జీవిత భాగస్వామి | సౌందరరాజన్ | ||
సంతానం | సుగానాథన్ సౌందరరాజన్ | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ |
తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి 2024 మార్చి 18న రాజీనామా చేసింది.[8] 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె 18 ఫిబ్రవరి 2021న చెన్నైలోని పార్టీ కార్యాలయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై సమక్షంలో బీజేపీలో చేరింది.[9]