From Wikipedia, the free encyclopedia
షాహ్ జాదీ (సామ్రాజ్యపు యువరాణి) జహాఁ ఆరా బేగం సాహిబా (ఉర్దూ : شاهزادی جہاں آرا بیگم صاحب}) (ఏప్రిల్ 2, 1614 – సెప్టెంబర్ 16, 1681) షాజహాన్, ముంతాజ్ మహల్ మొదటి కూతురు.[1] మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క పెద్ద అక్క. ఈమె ఆకాలపు సూఫీలలో ప్రముఖురాలు.
జహాఁ ఆరా బేగం సాహిబా | |
---|---|
మొఘల్ సామ్రాజ్యపు షాహ్ జాది | |
జననం | 2 ఏప్రిల్ 1614 |
మరణం | 16 సెప్టెంబరు 1681 |
Burial | |
House | మొఘల్ సామ్రాజ్యం |
తండ్రి | షాజహాన్ |
తల్లి | ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) |
మతం | ఇస్లాం |
మరణము తరువాత ఔరంగజేబు ఈమెకు "సాహిబా అజ్-జమాని" (యుగపు షాహ్ జాదీ) అనే బిరుదును ప్రకటించాడు.[2] ఈమెను ఢిల్లీ లోని నిజాముద్దీన్ దర్గా కాంప్లెక్స్ లో ఖననం చేశారు. ఈమె సమాధిపై క్రింది వాక్యాలు లిఖించబడి వున్నాయి :
అల్లాహ్ జీవించి వున్న వాడు, ఎల్లప్పుడూ ఉంటాడు.
నా సమాధిని ఎవరూ దేనితోనైనా కప్పకండి, పచ్చిక తప్ప.
పేదవారికి ఈ పచ్చికే గొప్ప సమాధి.
సీదాసాదా యువరాణి జహానారా అమరురాలైనది.
ఖ్వాజా నిజాముద్దీన్ చిష్తీ శిష్యురాలు,
చక్రవర్తి షాజహాన్ కుమార్తె,
అల్లాహ్ ఈమెపై తన కరుణను ప్రసాదించనీ.
1092 [1681 AD]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.