గురుగ్రంథ సాహిబ్
From Wikipedia, the free encyclopedia
గురుగ్రంధ సాహిబ్ (పంజాబీ భాష : ਗੁਰੂ ਗ੍ਰੰਥ ਸਾਹਿਬ ), లేదా ఆది గ్రంధ్, లేదా ఆది శ్రీ గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు మతస్తుల పవిత్ర గ్రంథం, ఆఖరి గురువు.[1]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గురు గోవింద్ సింగ్ (1666-1708), సిక్కుల గురువు లలో పదవ గురువు, ఆది గ్రంధ్ను తన వారసురాలిగా ప్రకటించాడు, మానవులలో గురువులుగా ప్రకటించే విధానాన్ని స్వస్తిపలికి, గ్రంథమైన "ఆది గ్రంధ్"ను తన తరువాత గురువుగా ప్రకటించాడు.[2] ఈ గ్రంథం పవిత్రగ్రంథంగానే గాక, పది-గురువుల జీవనవిధానంగానూ పరిగణింపబడింది.[3] గురుగ్రంధ సాహిబ్, ప్రార్థనలకొరకు ఒక వనరుగా పరిగణింపబడింది.[4] మరియుసిక్కు మతములో ప్రార్థనాంగము.
గురు అర్జున్ దేవ్ (1563-1606) చే మొదటిసారిగా ఆది గ్రంథం కూర్పు చేయబడింది. ఇందులో మొదటి ఐదు సిక్కు గురువులు, హిందూ ముస్లింల సంప్రదాయాలకు చెందిన అనేక గురువుల గురించి వ్రాయబడింది.[5] గ్రంథాన్ని అసలు రూపం ఇచ్చినవారు భాయ్ గురుదాస్, తరువాత భాయ్ మణిసింగ్. పదవ గురువు పరమదించిన తరువాత, ఆదిగ్రంధ్ చేతివ్రాత ప్రతులను బాబా దీప్ సింగ్ తయారుచేసి పంచిపెట్టాడు. గురుగ్రంధ సాహిబ్ గ్రంథము 1430 పుటలు కలిగిన గ్రంథము. సిఖ్ గురువుల కాలంలో, 1469 నుండి 1708 వరకు గ్రంథరూపం ఇవ్వబడింది.[1] ఈ గ్రంథం స్తోత్రం రూపంలో ఉంది.[5]