కొడమంచిలి
ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల గ్రామం / From Wikipedia, the free encyclopedia
కొడమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన గ్రామం.[2]. ఇది మండల కేంద్రం ఆచంట నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది ఒక్కప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. గోదావరి నది పాయ అయిన వశిష్టానది రెండు కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ ఊరి మీదుగా చినమల్లం, పెదమల్లం, సిద్దాంతం ల నుండి నేషనల్ హైవే నెంబర్ ఏడుకు (NH-7) చేరుకోవచ్చు.నర్సాపురం నుండి రాజమండ్రి బస్సులు ఉన్నాయి. ఆటోలు ఆచంట వరకూ తిరుగుతూ ఉంటాయి.
త్వరిత వాస్తవాలు కొడమంచిలి, దేశం ...
కొడమంచిలి | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°36′18″N 81°50′0″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఆచంట |
విస్తీర్ణం | 8.11 కి.మీ2 (3.13 చ. మై) |
జనాభా (2011)[1] | 6,151 |
• జనసాంద్రత | 760/కి.మీ2 (2,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 3,139 |
• స్త్రీలు | 3,012 |
• లింగ నిష్పత్తి | 960 |
• నివాసాలు | 1,745 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్కోడ్ | 534269 |
2011 జనగణన కోడ్ | 588689 |
మూసివేయి