కేశవ శంకర్ పిళ్ళై
కార్టూనిస్ట్ / From Wikipedia, the free encyclopedia
కేశవ శంకర్ పిళ్ళై (మళయాళం|കെ. ശങ്കര് പിള്ള) (1902 జూలై 31 – 1989 డిసెంబరు 26), భారతీయ కార్టూనిష్టు. ఆయన "శంకర్"గా సుపరిచితులు.[1] ఆయన 1948 లో "శంకర్ వీక్లీ", "పంచ్ (పత్రిక) ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ, కుట్తీ వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఆయన జూన్ 25 1975న ఎమర్జెన్సీ కాలంలో పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపారు.
త్వరిత వాస్తవాలు కె.శంకర్ పిళ్ళై, జననం ...
మూసివేయి
ఆయనకు 1976లో పద్మవిభూషణ (భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పురస్కారం) లభించింది.[2] ఆయన 1857లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును, 1965లో శంకర్ ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం స్థాపించి గుర్తింపు పొందారు.