కమ్మ
From Wikipedia, the free encyclopedia
కమ్మ (Kamma) అనునది భారతదేశంలో ఒక కులం లేక సామాజిక వర్గం.[1] కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు.కమ్మవారు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.[2][3] వీరి భాష తెలుగు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా మరికొంత మంది కమ్మవారు పేరులో చౌదరి, నాయుడు గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు.[4] 1910లో కృష్ణా జిల్లా కౌతారంలో మొదటి కమ్మ మహాసభ జరిగింది.కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మ నాబయ్య [5] కీలక పాత్ర పోషించారు