![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9d/S._Janaki_amma.jpg/640px-S._Janaki_amma.jpg&w=640&q=50)
ఎస్. జానకి
ప్రముఖ గాయని / From Wikipedia, the free encyclopedia
ఎస్.జానకి (జ.ఏప్రిల్ 23,1938) గా అందరికి పరిచయమైన శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా మలయాళం, కన్నడ భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
ఎస్.జానకి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి |
ఇతర పేర్లు | అమ్మ , కర్ణాటక కొలిగె ,జానకమ్మ , కోయిలమ్మ |
జననం | (1938-04-23) 1938 ఏప్రిల్ 23 (వయసు 86) రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో |
సంగీత శైలి | నేపథ్యగానం, కర్ణాటక సంగీతము |
వృత్తి | గాయని ,సంగీత దర్శకురాలు |
క్రియాశీల కాలం | 1957–2017 |
జీవిత భాగస్వామి | వి.రామప్రసాద్ (m.1958–1997) (అతని మరణం) |
పిల్లలు | మురళీకృష్ణ (b.1960) |
బంధువులు | గరిమెళ్ళ బలకృష్ణప్రసాద్ (Nephew) |
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. మైసూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని తిరస్కరించారు.
1957 లో విధియిన్ విలయాట్టు అనే తమిళ సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన జానకి సెప్టెంబరు 2016 న తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.[1]