ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
భారతీయ గాయిని / From Wikipedia, the free encyclopedia
'ఎం.ఎస్.సుబ్బులక్ష్మి లేదా ఎం.ఎస్.గా పేరుగాంచిన మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (1916 సెప్టెంబర్ 16 – 2004 డిసెంబర్ 11) కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని , నటి. ఈమె భారతదేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణి, ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి. 1974 లో రామన్ మెగసెసె పురస్కారం పొందినప్పుడు అవార్డు ప్రదాతలు ప్రకటిస్తూ కర్ణాటక సంగీత శ్రోతల్లో తీవ్రమైన స్వచ్ఛతావాదులు శ్రీమతి. ఎం. ఎస్. సుబ్బులక్ష్మిని కర్ణాటక సంగీతపు శాస్త్రీయ, అర్థ-శాస్త్రీయ గీతాలాపనలో ప్రస్తుతపు ప్రధాన విశేషంగా పరిగణిస్తారు అని వ్యాఖ్యానించారు.
త్వరిత వాస్తవాలు ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి, జననం ...
ఎం.ఎస్.సుబ్బు లక్ష్మి | |
---|---|
జననం | మధురై షణ్ముఖవడివు సుబ్బు లక్ష్మి 16 సెప్టెంబరు 1916 |
మరణం | 2004 డిసెంబరు 11(2004-12-11) (వయసు 88) |
మరణ కారణం | ఊపిరితిత్తుల న్యుమోనియా, హృదయ సంబంధ సమస్యలతో[1] |
వృత్తి | కర్నాటక సంగీత గాయకురాలు , నటి |
జీవిత భాగస్వామి | త్యాగరాజన్ సదాశివన్ |
పిల్లలు | రాధా విశ్వనాథన్ |
తల్లిదండ్రులు |
|
సంతకం | |
మూసివేయి