ఎన్.జి.రంగా
స్వాతంత్ర సమరయోధుడు / From Wikipedia, the free encyclopedia
ఆచార్య ఎన్.జి.రంగా (ఆంగ్లం: N.G.RANGA)గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు (నవంబరు 7, 1900 - జూన్ 9, 1995) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ వాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.[1] 1991 లో భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 1930-1991 వరకు సుదీర్ఘ కాలం భారత పార్లమెంట్ సభ్యునిగా పనిచేసారు.[2]
త్వరిత వాస్తవాలు గోగినేని రంగనాయకులు, జననం ...
గోగినేని రంగనాయకులు | |
---|---|
జననం | గోగినేని రంగనాయకులు నవంబరు 7, 1900 |
మరణం | జూన్ 9, 1995 |
ఇతర పేర్లు | ఎన్.జి.రంగా భారత రైతాంగ ఉద్యమపిత |
వృత్తి | లోక్ సభ సభ్యుడు , రైతు నాయకుడు |
ప్రసిద్ధి | భారత స్వాతంత్ర సమరయోధుడు, |
రాజకీయ పార్టీ | కాంగ్రెసు పార్టీ కృషికార్ లోక్ పార్టీ |
మతం | హిందూ మతము హేతువాది |
తండ్రి | గోగినేని నాగయ్య |
తల్లి | అచ్చమాంబ |
మూసివేయి