ఆపరేషన్ మేఘదూత్
సియాచెన్ హిమానీనదాన్ని ఆక్రమించేందుకు భారత్ చేసిన ఆపరేషను / From Wikipedia, the free encyclopedia
సియాచెన్ హిమానీనదం ప్రాంతాన్ని ఆక్రమించేందుకు 1984 ఏప్రిల్ 13 న భారత సైనిక దళాలు చేపట్టిన ఆపరేషన్ను ఆపరేషన్ మేఘదూత్ అంటారు. ఈ ఆపరేషను, సియాచెన్ ఘర్షణల్లో భాగం. ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధరంగంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ సైనిక చర్య ఫలితంగా భారత దళాలకు సియాచెన్ హిమానీనదం ప్రాంతం మొత్తంపై నియంత్రణ చేకూరింది.
త్వరిత వాస్తవాలు ఆపరేషన్ మేఘదూత్, తేదీ ...
ఆపరేషన్ మేఘదూత్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
సియాచెన్ ఘర్షణలో భాగము | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
![]() | ![]() | ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
లెఫ్టినెంట్. జన. ప్రేంనాథ్ హూన్ లెఫ్టినెంట్. కల్నల్. డి. కె. ఖన్నా | లెఫ్టినెంట్. జన. జహీద్ ఆలీ అక్బర్ బ్రిగేడియర్ జన. పర్వేజ్ ముషార్రఫ్ | ||||||||
బలం | |||||||||
3,000+ [1] | 3,000[1] | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
36[2] | 200+[2] |
మూసివేయి
6,400 మీ పైచిలుకు ఎత్తులో ఉన్న సియాచెన్లో భారత పాకిస్తాన్లు చెరి 10 పదాతి దళ బెటాలియన్లను మోహరించి ఉన్నాయి. ప్రపంచంలో, 5,000 మీటర్లకు మించిన ఎత్తులో ట్యాంకులు, ఇతర భారీ ఆయుధాలను మోహరించిన ఏకైక సైన్యం భారత సైన్యం.