ఆనందిబెన్ పటేల్
From Wikipedia, the free encyclopedia
ఆనందిబెన్ జేతాభాయి పటేల్ (జ.నవంబరు 21, 1941 ) [1] 1998 నుండి భారతదేశం లోని గుజరాత్ రాష్ట్ర శాసనసభ్యులుగా ఉన్న రాజకీత వేత్త.[2] ఆమె 1987 నుండి భారతీయ జనతా పార్టీ సభ్యురాలుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు, భవనాలు, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, పట్టణ గృహనిర్మాశాఖ, డెసాస్టర్ మేనేజిమెంటు, ప్రధాన ప్రాజెక్టులు శాఖలకు మంత్రిగా ఉన్నారు.[3]
ఆనందిబెన్ పటేల్ | |||
Assembly Member మండల్, అహ్మదాబాద్ జిల్లా | |||
పదవీ కాలం 1998 – 2002 | |||
Assembly Member for పటాన్, గుజరాత్ | |||
పదవీ కాలం 2002 – 2007 | |||
పటాన్, గుజరాత్ ప్రతినిధి - శాసనసభ సభ్యులు | |||
పదవీ కాలం 2007 – 2012 | |||
Assembly Member for ఘట్లోడియా | |||
పదవీ కాలం 2012 – Incumbent | |||
పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ | |||
పదవీ కాలం 1994 – 1998 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1941-11-21) 1941 నవంబరు 21 (వయసు 82) | ||
జాతీయత | భారతీయులు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జేథాబాయి పటేల్ | ||
జీవిత భాగస్వామి | మఫట్లా పటేల్ | ||
సంతానం | సంజత్ పటేల్ , అనార్ పటేల్ | ||
వృత్తి | విద్యావేత్త | ||
కేబినెట్ | గుజరాత్ ప్రభుత్వం | ||
శాఖ | విద్యాశాఖా మంత్రి, ఉన్నత , సాంకేతిక విద్యా మంత్రి, మహిళా , శిశు సంక్షేమ శాఖా మంత్రి, క్రీడలు,యువజన , సాంస్కృతిక వ్యవహారాలు(1998-2007) రెవెన్యూ మంత్రి, డిసాస్టర్ మానేజిమెంటు, రోడ్లు ,భవనాలు ప్రాజెక్టు, మహిళా, శిశు సంక్షేమం, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | http://www.anandibenpatel.com |
2014 భారత సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ భారత పార్లమెంటుకు భా.జ.పా తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నిక అయినప్పటి నుండి ఆయన దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారంలో ఉన్న కాలంలో ఆమె గుజరాత్ ముఖ్యమంత్రి పాత్రను సమర్ధవంతంగా పోషించారు.[4] ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆమెను దేశంలో అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా చేర్చింది.[5] గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైనందున ఆయన మే 21 2014 న తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్ ను శాసన సభా పక్షం ఎన్నుకొంది. ఆమె గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆమె భా.జ.పా గుజరాత్ శాఖలో కీలక నాయకురాలు. ఈమె గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్, ప్రస్తుత ముఖ్యమంత్రి నరేంద్ర మోడి మంత్రి వర్గాలలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో మహిళా శాసనసభ్యులలో అత్యధిక కాలం శాసనసభ్యురాలిగా ఉన్న మహిళ. ఆమె రాజకీయ జీవితాన్ని 1994 లో రాజ్యసభ సభ్యురాలిగా ప్రారంభించారు. ఆ తర్వాత 1998 లో గుజరాత్ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి ఆ రాష్ట్ర శాసనసభ్యురాలిగా ఎన్నికైనారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ లో వరుసగా నాలుగుసార్లు మహిళా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. ఆమె నాలుగవ సారి ఎన్నికైన తర్వాత గుజరాత్ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినారు.