ఆత్రేయ
నాటక, సినీ గీత, కథా రచయిత / From Wikipedia, the free encyclopedia
ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 - సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి.[1] అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.
త్వరిత వాస్తవాలు ఆత్రేయ, జననం ...
ఆత్రేయ | |
---|---|
జననం | కిళాంబి వెంకట నరసింహాచార్యులు 1921, మే 7 మంగళంపాడు సూళ్ళూరుపేట మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్ |
మరణం | సెప్టెంబర్ 13, 1989 |
నివాస ప్రాంతం | చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | ఆత్రేయ |
వృత్తి | కవి, రచయిత నిర్మాత సినిమా దర్శకుడు |
మతం | హిందూ |
తండ్రి | కృష్ణమాచార్యులు |
తల్లి | సీతమ్మ |
మూసివేయి