నాగార్జునుడు
ప్రముఖ బౌద్ధ తత్వవేత్త,indian ఐన్ స్టీన్ / From Wikipedia, the free encyclopedia
ఆచార్య నాగార్జునుడు (అశ్వఘోషుడు) (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన బౌద్ధ ధర్మ తాత్వికుడు. ఇతను కనిష్క చక్రవర్తి సమకాలికుడు. మహాయాన బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి మాధ్యమిక సూత్రములను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము చైనా దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య నాగార్జునుడు మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. నలందా విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
త్వరిత వాస్తవాలు నాగార్జున, జననం ...
నాగార్జున | |
---|---|
జననం | సుమారు 150 CE |
మరణం | సుమారు 250 CE భారతదేశం |
వృత్తి | బౌద్ధమతగురువు, సన్యాసి, తత్వవేత్త. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మహాయన బౌద్ధంలోని మాధ్యమిక తత్వ స్థాపకుడు. |
మూసివేయి